
Vastu Dosh in Conflicts between wife and husband
Vastu Shastra : మన హిందూ సాంప్రదాయాల ప్రకారం వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనం ఉండే ఇంటి నుంచి మన కష్ట సుఖాలు, లాభ నష్టాల వరకు ఇలా ప్రతీ దానితో వాస్తు శాస్త్రం ముడిపడి ఉంది. అలాగే మన కుటుంబంపై, కుటుంబంలోని సభ్యుల సంతోషం, ఆనందం, కష్టాలు, నష్టాలు, సమస్యలు ఇలా అన్నింటిపై వాస్తు ప్రభావం ఉంటుంది. అయితే మన ఇంట్లో ఎలాంటి సమస్యలు తలెత్తినా, చెడు సంఘటనలు జరిగినా ముందుగా మనం వెళ్లి కలిసేది వాస్తు శాస్త్ర నిపుణుడినే. మనం ఉన్న ఇంటిలో ఏదైనా వాస్తు దోషం ఉందా.. అందువల్లే మనకు సమస్యలు వస్తున్నాయోమే అని తెలుసుకుంటాం. ఒకవేళ వాటి వల్లే సమస్యలు ఉన్నాయని తెలిస్తే… వెంటనే వాటిని సరి చేసుకుంటాం. అయితే ఇంట్లో కొన్ని వస్తువులను కొన్ని స్థలాల్లో పెట్టడం వల్ల కూడా కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతాయని ప్రముఖ వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఇంట్లో గొడవలు జరగకుండా ఉండి…
మనం సంతోషంగా ఉండాలంటే వాస్తు ప్రకారం మన ఇంట్లో కొన్ని వస్తువులను ఎలా ఉంచుకోవాలో చెబుతున్నారు.వాస్తు శాస్త్రం ప్రకారం మనం ప్రతిరోజూ నిద్ర పోయే మంచం ఎప్పుడూ నైరుతి దిశలోనే ఉండేలా చూసుకోవాలి. అలాగే నిద్రపోయే సమయంలో మన తల దక్షిణ దిశవైపు పెట్టి పడుకోవాలి. అలా దక్షిణం వైపు తల ఉంచి పడుకోవడం వల్ల మన శరీరంలో శక్తి ప్రవాహానికి అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా మనం లేచి చూడగానే మన ఇష్ట దైవం కనిపించేలా మన ముందు దేవుడి విగ్రహాన్ని లేదా చిత్ర పటాన్ని పెట్టుకోవాలి. అలాగే వీలయినంత వరకూ ప్రతిరోజూ పూజలు చేస్తే.. ఇంట్లో గొడవలు తగ్గి చాలా సంతోషంగా ఉంటారని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంటి నైరుతి వైపు ఎలాంటి తలుపులు, కిటికీలు ఉంచకూడదట. అలా ఉంచడం వల్ల దొంగతనం లేదా అగ్ని ప్రమాదం జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయట.
Vastu Shastra tips for solve family issues
ఒక వేళ ఇప్పటికే మన ఇంట్లో కిటికీలు, తలుపులు నైరుతి వైపు ఉంటే ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రతీ గురువారం ఉదయం ఆవుకు బెల్లం, పప్పు, సెనగలు, రొట్టెల వంటివి తినిపించడం వల్ల ఇలాంటి దోషాలు తొలగిపోతాయి. అంతే కాకుండా వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంటి ముఖ ద్వారం వద్ద ఎలాంటి తీగల చెట్లు, ముల్ల చెట్లను పెంచకూడదు. అలాగే మురికి నీరు ఇంటి ముందు నుంచి ప్రవహించకుండా చూసుకోవాలి. ఇలా ఉండటం ద్వారా ఆ ఇంట్లో నివసించే వారు చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందట. అయితే దీని నుంచి ఉపశమనం పొందాలనుకుంటే మన ఇంటి ముఖ ద్వారం వద్ద వినాయకుడి ప్రతిమను ఉంచాలి. అలా చేయడం వల్ల దోషాలు తొలగిపోయి కుటుంబ సభ్యులంతా సుఖసంతోషాలతో జీవిస్తారట.
Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గులాబీ పార్టీపై చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మరింత…
Gautam Gambhir : టీమ్ ఇండియా కోచ్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా…
Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారారు.…
KCC Loan for Farmers : దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆర్థికంగా బలపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక…
LPG Gas Cylinder 2026: దేశమంతటా LPG Gas Cylinder వినియోగించే కుటుంబాలకు ఇది నిజంగా శుభవార్త. రోజురోజుకు డిజిటల్…
Father and Daughter Love: సోషల్ మీడియాలో ఇటీవల వైరల్గా మారిన ఓ వీడియో లక్షలాది మంది నెటిజన్ల కళ్లను…
Viral Video: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా కుడాల్ నగర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సావంత్ అనే యువకుడు ఇటీవల సెంట్రల్…
SBI Loan: ఇంటి బాధ్యతలతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చే ప్రతి స్త్రీ మనసులో ఒక చిన్న ఆశ…
This website uses cookies.