Varalakshmi Vratam : ప్రతి ఏడాది వచ్చే శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలి అని అంటారు. అయితే ఈసారి వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అంటూ కొత్త చర్చ జరుగుతుంది. శ్రావణమాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతాన్ని ఆడవారి ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఆరోజు సకల సౌభాగ్యాలను అందించి వరలక్ష్మీ దేవిని కొలుచుకోవడం వల్ల సకల సుఖాలు కలుగుతాయని ఆడవారి నమ్మకం. అయితే ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఏ రోజున ఏ సమయంలో జరుపుకోవాలని అనే సందేహం అందరిలోనూ ఉంది. అయితే ఏ సమయంలో వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటే మంచి శుభాలు కలుగుతాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
శ్రావణమాసంలో ఆగస్టు 16న వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి అనుకునే వారికి శుభ ముహూర్తాలు ఎలా ఉన్నాయంటే ఆగస్టు 16 ఉదయం 5:30 నుంచి 8:14 నిమిషాల వరకు ఈ సమయం ఉదయం పూజకు అనువైనది. అలాగే మంత్రాలు పట్టించడానికి అనుగుణంగా ఉంటుంది. ఉదయం సూర్యకిరణాలు సానుకూల శక్తిని ఇస్తాయి. మధ్యాహ్నం 12: 50 నిమిషాల నుండి మూడు గంటల 8 నిమిషాల వరకు ఈ సమయం పూజ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు అందరూ పూజ చేసుకోవడానికి అలాగే వ్రత కథలు వినడానికి ఇది మంచి సమయం. సాయంత్రం 6:50 నుంచి రాత్రి 8: 25 నిమిషాల వరకు ఈ సమయం సాయంత్రం పూజకు దీపారాధనకు అనువైనది. సాయంత్రం సమయంలో దీపాలు వెలిగించడం స్తోకాలను పట్టించడం వలన ప్రశాంతమైన వాతావరణ నెలకొంటుంది. అర్ధరాత్రి 11:22 నిమిషాల నుంచి తెల్లవారుజామున 1:18 నిమిషాల వరకు ఈ సమయం అర్ధరాత్రి పూజ చేసుకోవాలి అనుకునే వారికి నిశ్శబ్దంగా ధ్యానం చేసుకోవాలి అనుకున్న వారికి అనుకూలంగా ఉంటుంది. రాత్రి సమయంలో ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది. ఇది మనసును ఏకాగ్రతతో ఉంచడానికి సహాయపడుతుంది.
ఈరోజు నా తెల్లవారుజామున లేచి శుభ్రమైన కొత్త బట్టలను ధరించాలి. పూజ గదిని కడిగి గంగాజలంతో పవిత్రం చేసుకోవాలి. పూలతో మామిడి ఆకులతో అందంగా అలంకరణ చేయాలి. ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు పువ్వులతో అలంకరించాలి. ఇక పూజకు కావాల్సిన వస్తువులను సిద్ధం చేసుకోవాలి. చక్క పీటపై ఎర్రటి వస్త్రం పరిచి లక్ష్మీదేవి గణపతి విగ్రహాలు లేదా చిత్రపటాలను ఉంచాలి. విగ్రహాలు కింద బియ్యం పోసి వాటిపై కలశాన్ని నీటితో నింపాలి. విగ్రహాలకు నైవేద్యం పండ్లు పూలు తాంబూలం సమర్పించాలి. నెయ్యితో దీపాన్ని వెలిగించి అగర్బత్తుల తో ధూపం వెలిగించాలి. ముందుగా గణపతి పూజ చేయాలి. విజ్ఞాలను తొలగించి పూజ సజావుగా జరగడానికి వినాయకుడి అనుగ్రహం కోరాలి. అమ్మవారికి కనీసం 9 లేదా ఐదు రకాల నైవిద్యాలను సమర్పించాలి. పులిహోర పాయసం శనగలు చలివిడి వడపప్పు బూరెలు వంటివి సాధారణంగా సమర్పించే నైవేద్యాలు సమర్పించాలి శ్రద్ధతో వరలక్ష్మి కథను చదవాలి. ఇది వ్రతం యొక్క ప్రాముఖ్యతను దాని వెనక ఉన్న భక్తిని లక్ష్మీదేవి యొక్క కరుణను తెలియజేస్తుంది.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.