Eat Food : మంచం పై కూర్చుని భోజనం చేస్తే ఆ ఇంట్లో వాళ్లకి జరిగేది ఇదే...!
Eat Food : చాలామంది భోజనం చేసే సమయంలో మంచం మీద కూర్చుని తింటూ ఉంటారు. హిందూ గ్రంధాల ప్రకారం మంచం మీద కూర్చుని భోజనం చేసేవారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు. వాస్తవానికి ఈ నమ్మకం వెనుక ఉన్న ప్రధాన కారణం ఏంటంటే ప్రతి పనికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. ప్రశాంతమైన, శుభ్రమైన ప్రదేశంలో కూర్చుని ఆహారం తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిదని నమ్ముతారు. అదే సమయంలో మంచం మీద కూర్చున్నప్పుడు తినడం కూడా ఆహార నియమాల్లో నిషేధం. మంచం మీద కూర్చొని భోజనం చేయడం గ్రంథాలలో ఎందుకు నిషేధించబడిందో అలా తినడం వల్ల నష్టాలు ఏమిటో తెలుసుకుందాం. మన పూర్వీకులు వంటగదిలో కూర్చొని ఆహారం తినేవారు. ఎందుకంటే వంట గదిలో వేడి ఆహారాన్ని తినడం వల్ల పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని నమ్మకం.నిజానికి వంట గదిలో మనం నేలపై కూర్చొని ఆహారాన్ని తినవచ్చు. ఇది ఆహారం బాగా జీర్ణం కావడానికి ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. వంటగదిలో కూర్చొని భోజనం చేయడం కూడా రాహువును ప్రసన్నం చేసుకోవడానికి సహాయపడుతుంది.
అందుకే తినడానికి ఉత్తమమైన ప్రదేశం వంటగది అని చెప్తుంటారు. జ్యోతిష్యం శాస్త్రాల ప్రకారం మనం ఎల్లప్పుడూ ఆహారానికి గౌరవం ఇవ్వాలి. కానీ మనం మంచం మీద కూర్చొని తింటే మంచం పడుకునే స్థలం కాబట్టి ఆహారాన్ని అవమానించినట్లు అవుతుంది. అందుకే మంచం మీద భోజనం చేయడం లక్ష్మీదేవిని అగౌరవ పరచడం లాంటిదని అంటారు. తినడం అనేది బృహస్పతి రాహువులకు సంబంధించినదని కూడా నమ్ముతారు. రాహువును అశుభగ్రహంగా పరిగణిస్తారు. మంచం మీద కూర్చొని భోజనం చేయడం వల్ల రాహుకు కూడా కోపం వచ్చి ఐశ్వర్యం తగ్గుతుందని నమ్ముతారు.అలసట కారణంగా మనం తరచూ మంచం మీద కూర్చొని తినడం ప్రారంభిస్తాము. అయితే అలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. బెడ్ సిట్టింగ్ తో మన ఆహారం మీద దృష్టి పెట్టలేము. చాలాసార్లు మనం బెడ్ మీద కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు లేదా లాప్టాప్ లో పనిచేస్తున్నప్పుడు టీవీని చూస్తాము. అటువంటి పరిస్థితుల్లో మన దృష్టి పూర్తిగా తినడంపై లేనప్పుడు మనం కూడా అతిగా తినడం చేస్తాము.
ఈ కారణంగా ఇది మన ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. మంచం మీద కూర్చున్నప్పుడు శరీరం బంగిమ కూడా సరిగా ఉండదు. దాని కారణంగా ఆహారం జీర్ణం కావడం కష్టమవుతుంది. మంచం మీద కూర్చొని భోజనం చేయడం వల్ల మంచం మీద కొన్ని ఆహార పదార్థాలు ఉంటాయి. దీని కారణంగా మీ నిద్రకు కూడా అంతరాయం కలుగుతుంది. మీరు భోజనం చేస్తున్నప్పుడు కొన్ని ఆహార పదార్థాలను మంచంపై పడవేస్తే అది మీ నిద్రకు బంధం కలిగించే క్రిములను మంచం మీదకి వచ్చేలా చేస్తుంది. ఈ క్రిములు చర్మ సమస్యల వంటి అనేక ఆరోగ్య సమస్యలకు కూడా దారి తీస్తాయి. ఈ కారణాలన్నీ అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి. అలాగే ప్లేట్లో ఆహారాన్ని వదిలేయడం ఆహారాన్ని అగౌరపరచడమే అవుతుంది. ఇది డబ్బు ఆహార కొరతకు దారితీస్తుంది. కాబట్టి ఆహారాన్ని ఎప్పుడు ప్లేట్లో మిగిల్చకూడదు. మట్టికుండ ఉపయోగించండి మన గ్రంథాలలో మట్టికుండ చాలా అద్భుతమైనదిగా పరిగణించబడుతుంది. మట్టి కుండలో వండుకొని తింటే 100% పోషకాలు అందుతాయి. ఆరోగ్యంతోనే అదృష్టం వస్తుందని కూడా అంటారు…..
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.