
Ayyappa Temple : అయితే అలా వెలిసిన అయ్యప్ప ఆలయం కాలక్రమేణా ఎలా అభివృద్ధి చెందుతువస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మొదట్లో ఈ శబరిమల వెళ్లడానికి ఒకే ఒక దారి మాత్రమే ఉండేది. అదే ఎరిమేలి మార్గం. అయితే అప్పట్లో ఈ గుడికి ప్రతిరోజు వెళ్లడం చాలా కష్టంగా ఉండేది . దాంతో నెలవారీగా ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు మాత్రమే పూజారులు వెళ్లేవారు. ఆ తర్వాత అడవిలో భక్తులు ఒంటరిగా వెళ్లడం ప్రమాదకరం కాబట్టి బృందాలుగా వెళ్లేవారు. అలా శబరిమలకు యాత్ర బృందాలు అప్పటినుంచి మొదలయ్యాయి. సుమారు 200 సంవత్సరాల క్రితం మొదటిసారిగా 70 మంది భక్తులు శబరిమలకు దర్శనానికి వచ్చారట.
ఆ సంవత్సరం ఆదాయం ఏడు రూపాయలని పందల రాజ వంశీకుల రికార్డులలో ఉంది. ఇక ఆ తర్వాత 1907వ సంవత్సరంలో అయ్యప్ప దేవాలయం పై కప్పుని ఎండు గడ్డి మరియు ఆకులతో నిర్మించారు. ఇక అప్పటి నుండి శబరిమలలో ఉన్న అయ్యప్ప శిలా విగ్రహానికి పూజలు జరగడం మొదలైంది. అయితే దురదృష్టవశాత్తు 1908,1909 మధ్య కాలంలో ఈ దేవాలయం లో అగ్నిప్రమాదం సంభవించి ధ్వంసం అయింది . దీంతో అయ్యప్ప ఆలయాన్ని మరల నిర్మించారు. ఈ సమయంలోనే అయ్యప్ప శిలా విగ్రహానికి బదులుగా పంచలోహాలతో తయారుచేసిన విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇలా పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్టించిన తర్వాత శబరిమల ప్రాముఖ్యత మరింత పెరిగింది.
Who destroyed the Ayyappa temple
అయితే ఈ దేవాలయం 1935 వరకు కూడా తిరువంకారు మహారాజు సంస్థ ఆధీనంలో ఉండేది. ఇక 1935లో దీన్ని దేవస్థానం బోర్డు వారికి అప్పగించడం జరిగింది. ఆ తర్వాత భక్తుల రాక అధికమవడంతో జ్యోతి దర్శనానికే కాకుండా మండల పూజ కి కూడా ఆలయాన్ని తెరవసాగారు. ఇంకా భక్తుల రద్దీ పెరగడంతో ఆలియానికి వచ్చే ఒక్క మార్గమే కాకుండా మరికొన్ని మార్గాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో శబరిమలకు వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగింది. 1945వ సంవత్సరం నుంచి భక్తుల సంఖ్య మరింత పెరగడంతో విషూ పంకుని ఉత్తారం, ఓనం వంటి పండుగ రోజుల్లో కూడా ఆలయాన్ని తెరవడం ప్రారంభించారు. ఇదే సమయంలో అయ్యప్ప ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు వెళ్లడం చూసి కొందరికి అసూయ
కలగడంతో 1950వ సంవత్సరంలో ఆలయాన్ని మరియు ఆలయంలోని అయ్యప్ప విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అలా పరుశురాముడు నిర్మించిన ఆలయం అనేది మూడుసార్లు అగ్నికి హవుతి అయింది. సంఘటన జరిగిన తర్వాత దేవస్థానం బోర్డు వారు భక్తుల విరాళాలతో మరల గుడిని నిర్మించి పంచలోహ అయ్యప్ప విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇదే ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్న శబరిమల. ఇలా శబరిమలకు క్రమంగా కేరళ నుండే కాకుండా భారతదేశ నలుమూలల నుండి భక్తుల రావడం మొదలైంది. దీంతో అప్పటివరకు కేరళై కేలి విగ్రహం గా కీర్తించిన అయ్యప్పను భారతకేలి విగ్రహంగా కీర్తించడం మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు బూతలి కేళి విగ్రహంగా కీర్తిస్తున్నారు.
Trump Modi Putin : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇరాన్ అమెరికా యుద్ధ వాతావరణాన్ని గమనిస్తే దీని వెనుక రష్యా…
India : ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థలు ఒడిదుడుకులకు లోనవుతున్న తరుణంలో భారతదేశం తన శక్తి అవసరాల కోసం ఒక…
Trisha - Vijay : తమిళ రాజకీయాల్లో ప్రస్తుతం దళపతి విజయ్ పేరు మారుమోగిపోతోంది. తన సొంత పార్టీ తమిళగ…
CM Revanth Reddy : తెలంగాణ ప్రజల ఆరోగ్యం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు నిజంగా అభినందనీయం.…
Mobile Recharge : మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల విషయంలో సామాన్యులకు ఊరటనిచ్చేలా భారీ మార్పులు రాబోతున్నాయి. ఇప్పటివరకు టెలికాం సంస్థలు…
Central Govt Employees DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు Central Government Employees, పెన్షనర్లకు ఇది నిజంగా…
AP and Telangana Weather Report : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఉదయం పూట సూర్యుడు…
Farmer : సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టు కోసం భూములు సేకరిస్తే.. రైతులు ఆందోళన చెందుతారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం…
Gold Silver Rate 31st March 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న పసిడి ప్రియులకు మళ్లీ సడెన్…
Karthika Deepam 2 March 31st 2026 Episode : స్టార్ మా ఛానెల్లో అత్యంత విజయవంతంగా, ప్రేక్షకుల ఆదరణ…
Pineapple Juice : వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి పైనాపిల్ రసం ఒక అద్భుతమైన పానీయం అని చెప్పవచ్చు.…
Potatoes : వేసవి కాలంలో బంగాళదుంపలు తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా బంగాళదుంపను ఒక…
This website uses cookies.