Home » Devotional » Why Lord Brahma Married His Own Daughter In Telugu
Devotional

Lord Brahma : బ్రహ్మదేవుడు కన్న కూతుర్నే ఎందుకు పెళ్లి చేసుకున్నాడు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…!

Authored By
aruna
The Telugu News | Published on: February 22, 2024, 12:00 pm
Advertisement

Lord Brahma : బ్రహ్మ భార్య ఎవరు అంటే టక్కున చెప్పే పేరు సరస్వతి. నిత్యం బ్రహ్మ పక్కన ఉంటూ మనకు దర్శనమిచ్చే బ్రహ్మ భార్య సరస్వతి గురించి మేము మీకు ఆసక్తికరమైన విషయాన్ని ఈరోజు చెప్పబోతున్నాం.. చదువుల దేవతగా అందరికీ తెలిపిన బ్రహ్మ భార్య సరస్వతి. నిజానికి బ్రహ్మ సొంత కూతురే అంటే మీలో ఎంతమంది నమ్ముతారు. బ్రహ్మ కూతురు సరస్వతి ఏంటి అనుకుంటున్నారా.. కానీ అది నిజం బ్రహ్మకూతురైన సరస్వతిని అతడు పెళ్లాడాడు అనే విషయం ఈ కాలంలో చాలా తక్కువ మందికి తెలుసు. మరి సొంత కూతురు సరస్వతిని బ్రహ్మ ఎందుకు పెళ్లాడాడు అనే ప్రశ్న మీలో చాలామందికి ఇప్పుడు మొదలయ్యే ఉండొచ్చు.. ఆ ప్రశ్నకు సమాధానం మేము మీకు చెప్పబోతున్నాం.. ఈ బ్రహ్మకు 5తలలుఎలా వచ్చాయి. సరస్వతిని బ్రహ్మ ఎందుకు పెళ్లాడాల్సి వచ్చింది వంటి ప్రశ్నలకు సమాధానాలతో పాటు బ్రహ్మా సరస్వతి పెళ్లి కథ ను కూడా తెలుసుకుందాం..

Advertisement

సరస్వతి పురాణం మధ్య పురాణంలో బ్రహ్మ తన కూతురైన సరస్వతిని పెళ్లాడని రాసింది. పురాణం ప్రకారం బ్రహ్మ తన శక్తితో సరస్వతిని పుట్టించాడు. దాంతో ఆమెకు తల్లి లేరు కేవలం తండ్రి మాత్రమే ఉన్నారు. ఆయనే బ్రహ్మ మత్స్య పురాణం ప్రకారం బ్రహ్మకు ఐదు తలలు ఉండేవి. బ్రహ్మ ఈ ప్రపంచాన్ని సృష్టించాక ఈ సృష్టిలో అతను మాత్రమే ఒంటరిగా ఉన్నాడు. దాంతో తన శక్తితో బ్రహ్మ సరస్వతి సంధ్య బ్రాహ్మణులను తయారుచేస్తారు. ఈ ముగ్గురిలో సరస్వతి దేవి చాలా సౌందర్యంగా ఉంది. దాంతో ఆమె అందానికి ఆకర్షితుడైన బ్రహ్మ నిత్యం సరస్వతి పై తన దృష్టిని ఉంచేవాడు. బ్రహ్మ కన్ను చూపు మేర నుండి తప్పించుకోవడానికి సరస్వతి నాలుగు వైపులా దాక్కునేది. దాంతో ఆమె ఉన్న నాలుగు దిక్కుల్లో నాలుగు తలలు బ్రహ్మకు వచ్చాయి. ఆమె బ్రహ్మ నుండి తప్పించుకోలేక పోయింది. చివరికి ఆమె ఆకాశంలో దాక్కొనవలసి వచ్చింది. కానీ బ్రహ్మ తన ఐదో కలర్ తోని సరస్వతిని చూస్తూనే ఉండేవాడు. దాంతో సరస్వతిని పెళ్లాడి మనిషి జాతిని నిర్మించాలని అనుకున్నాడు.

ఇక వంద సంవత్సరాలు పాటు వేరే ప్రదేశానికి వెళ్లి 100 సంవత్సరాలు వారిద్దరూ ఏకాంతంగా గడిపి మను అనే బాలుడికి జన్మనిచ్చారు. ఈ భూమిపై జన్మించిన మొదటి మనిషి మను అని అంటారు. అంతేకాకుండా వేదాలు సనాతన ధర్మాలు సంస్కృతం భాష వంటివి ఎన్నో భాషలకు మనును జనకుడు అని అంటారు. ఇలా మనుషు జాతిని నిర్మించడానికి బ్రహ్మ తన కూతురైన సరస్వతిని పెళ్లాడని అంటారు..అలాగే బ్రహ్మ ఒక తలలు కోల్పోయి నాలుగు తలలతో మాత్రమే ఎలా మిగిలాడు అనే విషయానికి బ్రహ్మ పెళ్లికి సంబంధించి ఓ ఆసక్తికరమైన కథని ఇప్పుడు తెలుసుకుందాం.. బ్రహ్మ సరస్వతి ఎటువైపు వెళ్తే అటు చూస్తూ ఉండేవాడట. కానీ ఎటువైపున కూడా బ్రహ్మ తనని వెంటాడుతూ ఉండటంతో భయపడిపోయిన సరస్వతి శివుని వద్దకు వెళ్లి బ్రహ్మం గురించి చెప్పి తనను కాపాడమని కోరిందట. దాంతో బ్రహ్మాం చేసే చర్యలకు కోపగించిన శివుడు బ్రహ్మ ఐదో తలను నరికేసాడట. ఆనాటి నుండి బ్రహ్మకు నాలుగు తలలే ఉన్నాయని అంటారు. అంతేకాకుండా బ్రహ్మం చేసిన పనికి తాను ఈ సృష్టికర్త అయినప్పటికీ బ్రహ్మను ఎక్కడ పూజించరు అని శాపం పెట్టాడట..

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి