ఏపీలో రోడ్లన్ని అధ్వానంగా ఉన్నాయని, వాటిని వెంటనే బాగు చేయాని జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వానికి విజ్ఙప్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రోడ్ల దుస్థితిని వివరించేందుకుగాను పలు ఫొటోలను జనసేన నేతలు ప్రదర్శిస్తున్నారు. కాగా, జిల్లాలోని మలికిపురం మండలం కేశనపల్లి నుంచి వెళ్లే రహదారి అంతా గుంతల మయంగా మారిందని స్థానికులు చెప్తున్నారు. ఈ రహదారిలో నిత్యం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొంటున్నారు.
స్కూల్స్కు వెళ్లే పిల్లలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నట్లు వివరిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్లు బాగు చేయాలని వేడుకుంటున్నారు. ఇకపోతే ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో రోడ్లన్నీ బాగు చేయాలని అధికారులకు సమీక్షా సమావేశం సందర్భంగా సూచించారు. వర్షాలు ఆగిపోయాక యుద్ధప్రాతిపదికన రోడ్లన్నీ పూర్తి చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఏపీలోని రోడ్ల విషయమై తాడేపల్లిలోని సీఎం ఆఫీసులో జగన్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
This website uses cookies.