Actor Kantha Rao : అలనాటి నటుడు కాంతారావు తెలుసు కదా. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఎటువంటి టెక్నాలజీ లేని కాలంలోనే సోషియో ఫాంటసీ సినిమాలను తీశారు ఆయన. 400 కు పైగా పౌరాణిక, జానపద, సాంఘీక సినిమాల్లో కాంతారావు నటించారు. తెలుగు సినీ పరిశ్రమకు ఆయన ఒక కన్ను వంటి వారు. ఆయన శత జయంతి ఉత్సవాలను తాజాగా హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో నిర్వహించారు. ఈసందర్భంగా కాంతారావు కొడుకు రాజా మాట్లాడుతూ..
భావోద్వేగానికి గురయ్యారు. మా తండ్రి తనకు ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని సినిమాలు తీశారు. ఒకప్పుడు మేము మద్రాస్ బంగ్లాలో ఉండేవాళ్లం. కానీ.. ఇప్పుడు సిటీకి దూరంగా ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాం. ఆస్తులన్నీ అమ్ముకోవడంతో ఇప్పుడు చేతుల్లో చిల్లిగవ్వ లేదని.. తమను తెలంగాణ ప్రభుత్వమే ఆదుకోవాలని ఆయన కోరారు. తమకు కనీసం ఒక ఇల్లు అయినా కేటాయించాలని కోరారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడకు సమీపంలోని గుడిబండ అనే మారుమూల గ్రామం కాంతారావు సొంతూరు.
అప్పట్లో నాటకాలు, సినిమా మీద ఉన్న ఆసక్తితో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. మద్రాస్ వెళ్లి అక్కడ తన టాలెంట్ ను నిరూపించుకొని తెలుగు ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలిగారు కాంతారావు. ఆయన పూర్తి పేరు తాడేపల్లి లక్ష్మీకాంతారావు. ఆయన 99 వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ కూడా నివాళులర్పించారు. ఆయన 400 కు పైగా సినిమాల్లో నటించారని తెలిపారు. ఆయన సినీ రంగానికి చేసిన సేవలను సీఎం కేసీఆర్ ఈసందర్భంగా గుర్తు చేసుకున్నారు. కాంతారావు.. సినీ కళామతల్లికి నుదుట తిలకంగా అభివర్ణించారు.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.