Bollywood Actress Rimi Sen : బాలీవుడ్ నటి రిమీ సేన్ తన కారుతో సమస్యలను ఎదుర్కొన్నందుకు కార్ కంపెనీ ల్యాండ్ రోవర్పై రూ.50 కోట్ల కోసం దావా వేసింది. సేన్ 2020లో రూ.92 లక్షలకు కారును కొనుగోలు చేసింది. తన ఫిర్యాదులో కారుకు సంబంధించిన మరమ్మతుల విషయంలో మానసిక వేదనలకు గురైనట్లు ఆమె ఆరోపించారు. జాగ్వార్ ల్యాండ్ రోవర్ వాహనాన్ని ఆమె సతీష్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి కొనుగోలు చేసింది. ఇది జనవరి 2023 వరకు చెల్లుబాటు అయ్యే వారంటీ కలిగి ఉంది.
అయితే COVID-19 మహమ్మారి మరియు తదుపరి లాక్డౌన్ల కారణంగా ఆంక్షలు ఎత్తివేసే వరకు కారును ఎక్కువగా ఉపయోగించలేదు. అనంతరం వాహనాన్ని ఉపయోగించడం ప్రారంభించినప్పుడు కారులోని అనేక లోపాలను ఆమె గుర్తించింది. వీటిలో సన్రూఫ్, సౌండ్ సిస్టమ్ మరియు వెనుక కెమెరాతో సమస్యలు ఉన్నట్లు పేర్కొంది. 2022 ఆగస్టు 25న వెనుక వైపు కెమెరా పని చేయకపోవడం వల్ల పిల్లర్ను కారు ఢీకొట్టిందని సేన్ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ సమస్యల గురించి డీలర్కు తెలిపితే సాక్ష్యం కోసం అడిగి తిరస్కరించినట్లుగా తెలిపింది. కారులో ఒక సమస్య పరిష్కరిస్తే మరో సమస్య ఉత్పన్నమవుతున్నట్లు వెల్లడించింది.
సేన్ దాఖలు చేసిన లీగల్ నోటీసులో కారు తయారీలో మరియు అధీకృత డీలర్ ద్వారా దాని తదుపరి నిర్వహణ లోప భూయిష్టంగా ఉందని పేర్కొంది. పదిసార్లు కారు మరమ్మతుల కోసం పంపబడినప్పటికీ అది సరికాలేదంది. దీనివల్ల తనకు మానసిక వేధింపులు మరియు అసౌకర్యం కలిగిందని ఆమె వెల్లడించింది. కావునా తాను అనుభవించిన మానసిక వేధింపులకు రూ.50 కోట్లు, అలాగే న్యాయపరమైన ఖర్చుల కోసం అదనంగా మరో రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. అలాగే ఆ కారు స్థానంలో మరో కారును ఇవ్వాలని కోరింది.
New Liquor Policy : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. కొత్తగా మద్యం…
Chandrababu : గత కొన్ని రోజులుగా ఏపీలో మెడికల్ సీట్ల వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. తన హయాంలో…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్…
Electric Tractor : రైతులకు శుభవార్త... వ్యవసాయంలో రైతులకు వెన్నుదన్నుగా నిలిచే సరికొత్త ట్రాక్టర్ను మహారాష్ట్రకు చెందిన యువకుడు అభివృద్ధి…
Blood : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మన శరీరంలో అన్ని అవయవాలు కూడా సక్రమంగా పని చేయాలి. అయితే…
Job : యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా APSSDC ఆధ్వర్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు…
Tongue : మన కళ్ళు పసుపు రంగులో మారిన లేక చర్మం పసుపు రంగులోకి మారిన కామెర్ల వ్యాధికి సంకేతం గా…
Pitru Paksha : సనాతన ధర్మం ప్రకారం పూర్వీకులకు అంకితం చేయబడిన నిర్దిష్ట కాలాన్ని పితృపక్షం అని పిలుస్తారు. ఇక…
This website uses cookies.