
Balakrishna serious on his son Mokshajna
Balakrishna : నటసింహం బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పటి నుంచో బాలయ్య అభిమానులు మోక్షజ్ఞ హీరో కావాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. నందమూరి ఫ్యామిలీ లో జూనియర్ ఎన్టీఆర్ 17 ఏళ్లకే హీరోగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు. అతి తక్కువ టైంలోనే మాస్ హీరోగా మంచి ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. కళ్యాణ్ రామ్, తారక రత్న కూడా 20 ఏళ్లకి ఎంట్రీ ఇచ్చారు కానీ మోక్షజ్ఞ మాత్రం ఇప్పటి వరకు ఇండస్ట్రీలో అడుగుపెట్టలేదు. ప్రస్తుతం మోక్షజ్ఞ వయసు 28 ఏళ్లు. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. గత ఐదేళ్లుగా బాలయ్య అభిమానులు బాగా ఒత్తిడి చేస్తున్నారు.
మోక్షజ్ఞ హీరో చేయాలంటూ గట్టిగ డిమాండ్ చేస్తున్నారు. మోక్షజ్ఞ హీరో అవ్వాలని బర్త్డే వేడుకలు ఎంతో గ్రాండ్గా నిర్వహిస్తున్నారు. ఇక ప్రతి ఏడాది మోక్షజ్ఞ ఎంట్రీ పై బాలయ్య ప్రకటన చేస్తూ వస్తున్నారు. కానీ ఇంతవరకి మోక్షజ్ఞ సినిమా రాలేదు. దీంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా దీనిపై బాలయ్య స్పందించారు. ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ఈ సబ్జెక్టుతో మోక్షజ్ఞ లాంచ్ బాగుంటుందని భావిస్తున్నాము. ఆదిత్య 999లో మోక్షజ్ఞ నటిస్తాడని వెల్లడించారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఎన్నికల తర్వాత ఉంటుందన్నారు. దీంతో ఈసారైనా బాలయ్యను నమ్మొచ్చా అని ఫ్యాన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
Balakrishna serious on his son Mokshajna
కాగా మోక్షజ్ఞ ఇటీవల స్లిమ్ అయ్యారు. బరువు తగ్గి హ్యాండ్సమ్ లుక్ లో కనిపించారు. ఇది సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ప్రిపరేషన్ లో భాగమే అంటున్నారు. గతంలో నటుడు కావడం మోక్షజ్ఞకు ఇష్టం లేదు. అందుకే బాలయ్య బ్రతిమిలాడినా ఒప్పుకోవడం లేదంటూ ప్రచారం జరిగింది. మరోవైపు బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ భగవంత్ కేసరి ‘ సినిమా చేస్తున్నారు. ఇది దసరా కానుకగా విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత దర్శకుడు బాబీతో ప్రకటించిన 109వ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్లోని ఒక మహిళా…
Renu Desai : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…
Virat Kohli : ఇండోర్లో న్యూజిలాండ్తో జరిగిన కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…
ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…
Youth Kidnap : రాజస్థాన్లోని ఝాలావర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. కేవలం ప్రేమించాడనే…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని అమలు చేస్తున్న కీలక పథకాలలో అన్నదాత…
CBN warning to YS Jagan : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జరిగిన సభలో…
This website uses cookies.