Balakrishna : ప్రస్తుతం బాలయ్య రేంజ్ ఎలా ఉందో మాటల్లో చెప్పలేం. ఎందుకంటే ఆహా ఓటీటీ లో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ టాక్ షో తో బాలయ్యకు ఫుల్ క్రేజ్ వచ్చేసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ క్రేజ్ తోనే వీరసింహారెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో బాలయ్య క్రేజ్ మరింత పెరిగింది. బాలయ్య హోస్ట్ గా ఆహా మీడియాలో ప్రసారమవుతున్న ఈ షోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల రెండవ సీజన్ పూర్తి చేసుకున్న ఈ షో ఇకమీదట ఉండబోదనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
సీజన్ 1 గ్రాండ్ ఫినాలే లో బాలయ్య ఈ షో కు రెండవ సీజన్ కూడా ఉంటుంది త్వరలోనే మళ్లీ కలుసుకుందాం అని అన్నారు. కానీ సీజన్ 2 గ్రాండ్ ఫినాలే లో ఇక సెలవు అని అర్థం వచ్చేటట్లుగా నా మదిలో ఈ జ్ఞాపకాలు చిరకాలం ఉంటాయి అని అన్నారు. అయితే దీని అర్థం తరువాతి సీజన్ లేదనేగా అని జనాలు అంటున్నారు. ఈ టాక్ షోలో బాలయ్య నేటి తరం హీరో, హీరోయిన్స్ తో చిట్ చాట్ చేశాడు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి హీరోలు వచ్చారు. అయితే వీళ్ళతోపాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు రావాల్సి ఉంది.
అలాగే బాలయ్య తరం హీరోలలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ రావాల్సి ఉంది. వీళ్ళందరితో సీజన్ 3 చేయవచ్చు. కానీ వీళ్లను సీజన్ 2 కే ఆహ్వానించారు. కానీ వీళ్లు పెద్దగా ఆసక్తి చూపలేదని తెలుస్తుంది. మళ్లీ వాళ్లని నమ్ముకొని సీజన్ 3 మొదలు పెట్టలేమని ఆహా మీడియా అభిప్రాయపడుతుందట. అందుకే సీజన్ 3 ఉండదని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై ఇంతవరకు ఎటువంటి ప్రకటన అయితే రాలేదు. జనాలు మాత్రం ఈ షో ఇక ఉండబోదని చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ షోకు చాలామంది అభిమానులు ఉన్నారు. తరువాతి సీజన్ రావాలని కోరుకుంటున్నారు.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.