Shanmukh : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ రసవత్తరంగా సాగుతోంది. టైటిల్ గెలుచుకునేందుకుగాను కంటెస్టెంట్స్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే వీకెండ్కు సంబంధించిన ప్రోమోను శనివారం స్టార్ మా వారు ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. సదరు ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.స్టార్ మా వారు రిలీజ్ చేసిన ప్రోమోలో ‘ప్యార్ సే కరెంగె సబ్ కా స్వాగత్’ సాంగ్తో ‘బిగ్ బాస్’ హోస్ట్, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు.
ఆ తర్వాత రెడ్ బాక్స్ అయిన కంప్లయింట్ బాక్స్ గురించి నాగార్జున్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. దానిని సూచించి కంటెస్టెంట్స్ ఎవరైనా కంప్లయింట్స్ చేయొచ్చని చెప్పాడు. దాంతో సిరి షణ్ముక్పైన ఫిర్యాదు చేసింది. తానేం చేశానని షణ్ముక్ ప్రశ్నించగా, సిరి కోసం కాకుండా శ్రీరామ్ కోసం ఆడుతున్నావంటూ ఫన్నీ కౌంటర్ వేశాడు నాగ్.ఈ క్రమంలోనే తనను షణ్ముక్ తిడుతున్నాడంటూ సిరి పేర్కొంది. ఇంతలో నాగార్జున జోక్యం చేసుకుని సిరి ఫ్రెండ్ అయినందుకుగాను షణ్ముక్ సిగ్గుపడుతున్నాడని చెప్తూనే..
ఫ్రెండ్లీ హగ్స్ ఇస్తానే ఉండాలని అని నాగ్ నవ్వులు పూయించాడు. ఇక ఆ తర్వాత కాజల్ సన్నీపై కంప్లయింట్ చేసింది. ఏమైనా మాట్లాడితే..‘ఆత్రం ఆత్రం’ చేస్తూ తనపైన అరిచేస్తున్నాడని కాజల్ చెప్పింది. దాంతో సన్నీ సారీ చెప్పాడు. ఇక తర్వాత ‘ఫస్ట్ ఫైనలిస్ట్’ ట్రోఫీ వద్దకు వెళ్లి చూసుకోవాలని శ్రీరామ్కు నాగార్జున చెప్తాడు. శ్రీరామ్ సేఫ్ అయితే ట్రోఫీ తనదేనని, లేదంటే కాదని చెప్పాడు..నాగార్జున.. అలా చెప్పిన తర్వాత శ్రీరామ్ అక్కడికి వెళ్లగానే ప్రోమో ముగుస్తుంది. ఆ తర్వాత ఏం అవుతుందో తెలియాంటే బిగ్ బాస్ ఎపిసోడ్ చూడాల్సిందే.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.