Acharya : ఆచార్య షూటింగ్ బ్రేక్..మెగాస్టార్‌కి అలా జరగడంతో టెన్షన్స్ పడుతున్న ఫ్యాన్స్.?

Authored By vamana sai | The Telugu News | Published on: March 10, 2021, 10:30 am

Acharya : ఆచార్య షూటింగ్ కి బ్రేక్ పడింది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో 152వ సినిమాగా తెరకెక్కుతోంది ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరంజీవికి జంటగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. చిరంజీవి తనయుడు టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. చరణ్ కి జంటగా టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్‌ని కూడా మేకర్స్ వెల్లడించడంతో శరవేగంగా ఈ సినిమా షూటింగ్ సాగుతోంది.

break-for-achraya-shooting-due-to-chiranjeevi-health-issue

break-for-achraya-shooting-due-to-chiranjeevi-health-issue

కాగా సడన్‌గా ఆచార్య సినిమాకి బ్రేక్ ఇచ్చాడట కొరటాల శివ. అందుకు కారణం మెగాస్టార్ కి ఉన్నట్టుండి ఆరోగ్య సమస్యలు తలెత్తడమేనని తెలుస్తోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో పాటు మరొక సినిమాని సెట్స్ మీదకి తీసుకురావాలని ప్లాన్ లో ఉన్న మెగాస్టార్ విరామం లేకుండా ఆచార్య షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఖమ్మం ఇల్లందు బొగ్గు గనుల్లో చిత్రీకరణ సాగుతోంది. చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌ల‌పై దర్శకుడు కొర‌టాల కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు.

Acharya : ఆచార్య కంప్లీట్ అవగానే చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో నటించబోతున్నాడు.

ఈ క్రమంలో బొగ్గు గ‌నుల ప్రాంతం కావ‌డంతో వేడి అధికంగా ఉండటం వ‌ల‌న చిరంజీవికి డీ హైడ్రేష‌న్ స‌మ‌స్య వచ్చిందట. దాంతో ఆచార్య షూటింగ్ ఉన్నపలంగా నిలిపివేశారు. చిరంజీవి ఆరోగ్యం కుదటపడ్డాక తిరిగి మళ్ళీ ఆచార్య సెట్స్ మీదకి వస్తుందని చిత్ర యూనిట్ వెల్లడించారు. ఇక ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తుండగా రెజీనా కసాండ్ర స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతోంది. కాగా ఆచార్య కంప్లీట్ అవగానే చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళ హిట్ సినిమా లూసీఫర్ తెలుగు రీమేక్‌లో నటించబోతున్నాడు.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp