
Chiranjeevi About Ap Ticket rates Go
Chiranjeevi : సినిమా పరిశ్రమలకు సంబంధించిన సమస్యలని సాల్వ్ చేసేందుకు చిరంజీవి ముందడగు వేసిన విషయం తెలిసిందే.గత కొద్ది రోజులుగా ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపిన ఆయన ఎట్టకేలకు విజయం సాధించాడు. ఏపీ ప్రభుత్వం మొత్తానికి సినిమా టికెట్ రేట్లకు సంబంధించిన జీవోను విడుదల చేసింది. అందరూ అనుకున్నట్టుగానే రాధే శ్యామ్ సినిమా విడుదల కంటే ముందుగానే ఈ జీవో వచ్చేసింది. ఇందులో టికెట్ రేట్ల అందరికీ ఆమోదయోగ్యంగానే ఉన్నాయి. కనిష్టంగా రూ. 20 ఉంటే.. గరిష్టంగా రూ. 250 ఉంది. అయితే 20 శాతం షూటింగ్లు ఏపీలో చేసి ఉండి.. రెమ్యూనరేషన్లు కాకుండా.. సినిమా బడ్జెట్ వంద కోట్లు అయి ఉంటే..
అలాంటి వాటికి టికెట్ రేట్లను పెంచుకునే వెసులు బాటును ఏపీ ప్రభుత్వం కల్పించింది.ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఈ కొత్త జీవోపై చిరంజీవి తన ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ‘తెలుగు సినిమా పరిశ్రమకు మేలు కలిగే విధంగా, అటు థియేటర్ల మనుగడను, ప్రజలకి వినోదం అందుబాటులో ఉండాలనే సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకుని, సినిమా టికెట్ రేట్స్ సవరిస్తూ సరికొత్త జీవో జారీ చేసిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి పరిశ్రమ తరుపున కృతజ్ఞతలు. చిన్న సినిమాకు ఐదవ షో అవకాశం కల్పించడం ఎందరో నిర్మాతలకు ఉపయోగపడే అంశం. సంబంధిత మంత్రి వర్యులు పేర్ని నాని గారికి, అధికారులకు, కమిటీకి ధన్యవాదాలు’ అని చిరంజీవి పోస్ట్ చేశాడు.
Chiranjeevi About Ap Ticket rates Go
ఇక తాజాగా ఆయన అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా చిరంజీవి బ్లడ్ బ్యాంకులో జరిగిన మహిళా దినోత్సవ సంబరాలకు హాజరయ్యారు. సినీ పరిశ్రమలోని మహిళలకు చిరంజీవి దంపతులు సన్మానం చేశారు. అలాగే, మహిళా కార్మికులకు చీరలు పంపిణీ చేయడం విశేషం. ఇక “సినిమా టికెట్ల జీవోపై ఇప్పుడు మాట్లాడను.. ఇది సందర్భం కాదు. నేను ఇప్పుడు ఏది మాట్లాడినా కాంట్రవర్సీ అయ్యే అవకాశం ఉంది. జీవో గురించి అవసరమైతే ప్రత్యేకంగా మాట్లాడతా” అని అన్నారు. ఇక కొత్త జీవో ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని..సినిమా టికెట్ల ధరల పెంపుపై ప్రత్యేకంగా మీడియా సమావేశం పెడతాను అని అన్నారు.
BPCL : ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి శుభవార్త అందింది. ప్రముఖ పబ్లిక్…
Aadhaar Card : భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ…
PM Modi : ఎన్నికల రాజకీయాల్లో అనుభవం కలిగిన ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన ప్రత్యేక శైలిని ప్రదర్శించారు.…
Samantha : అక్కినేని వారసుడు నాగచైతన్య, అగ్రనటి సమంత రూత్ ప్రభు ప్రేమకథ టాలీవుడ్లో ఒకప్పుడు హాట్ టాపిక్గా నిలిచింది.…
Airtel : టెలికాం రంగంలో మరోసారి ధరల పెంపు చర్చకు దారి తీసింది. ప్రముఖ టెలికాం సంస్థ Airtel తన…
CM Chandrababu : తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని పలు కీలక…
Indiramma Illu : తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేయడానికి చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కీలక…
Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాల్లో ‘రైతు భరోసా’…
Chicken skin : నాన్వెజ్ ప్రియుల్లో చాలామంది చికెన్ను చర్మంతో కలిపి తినడానికి ఆసక్తి చూపుతారు. ప్రత్యేకంగా ఫ్రైడ్ లేదా…
Coconut Water : వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు కొబ్బరి నీళ్లు ఉత్తమమైన సహజ పానీయం. ఇవి దాహాన్ని…
Summer Diet : వేసవి కాలం మొదలవగానే మన ఆహారపు అలవాట్లలో మార్పులు చేయడం అవసరం అవుతుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల…
Tamil Nadu Elections : తమిళనాడులో ఇప్పుడు ఎన్నికల వేడి మామూలుగా లేదు. అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని డీఎంకే, ఏఐడీఎంకే…
This website uses cookies.