Is Modi Offered Chiranjeevi For CM Post
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశ వ్యాప్తంగాను మంచి క్రేజ్ ఉంది. సినిమా వాళ్ల నుండి రాజకీయ నాయకుల వరకు చిరంజీవిని ఎంతగానో ఇష్టపడుతుంటారు. చిరంజీవిని స్పూర్తిగా తీసుకొని చాలా మంది పరిశ్రమలో అడుగుపెట్టి స్టార్స్గా మారారు.తాజాగా మెగాస్టార్ చిరుకు అరుదైన గుర్తింపు లభించింది. ప్రధాని నరేంద్రమోదీ కార్యక్రమానికి అధికారికంగా ఆహ్వానం అందింది. ప్రధాని కార్యక్రమానికి పిలుపనేది అరుదైన అవకాశం.
ఆంధ్రప్రదేశ్ భీమవరంలో జూలై 4వ తేదీన ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి నిర్వహిస్తోంది. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిధిగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమం కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వాన లేఖని పంపించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి కిషన్ రెడ్డి..చిరంజీవిని కోరారు.
chiranjeevi shares stage with modi
మన్యం వీరుడిగా, హీరో ఆఫ్ జంగల్గా ఏపీ, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో అల్లూరి సీతారామరాజు అందరికీ సుపరిచితుడని మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. నాటి బ్రిటీషు వ్యతిరేక పోరాటంలో మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రాంతంలోని గిరిజనుల్ని ఏకం చేసి పోరాడిన వైనాన్ని మర్చిపోలేమని మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. అయితే ప్రధాని మోదీ నుంచి ఆహ్వానం అందడం అంత సులభం కాదు. కొంత మందికి మాత్రమే ఈ రకమైన ఆహ్వానం అందుతుంది. అలాంటి అరుదైన వ్యక్తుల జాబితాలో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరారు. ఈ వార్తతో చిరు ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Rishabh Pant : టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ టెస్ట్ క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్తో…
Actress : ఒకనాటి బాలీవుడ్ అందాలభామ రాణీ ముఖర్జీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం సినిమాలకి కాస్త దూరంగానే…
Vangalapudi Anitha : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత…
Warangal Congress : కాంగ్రెస్ పార్టీకి కొండా దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చి చెప్పాలని ఉమ్మడి వరంగల్…
RK Roja : ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్లా డైలాగులు చెప్పాడని, ఇప్పుడు మాత్రం రబ్బర్ లా…
Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యా రంగం పట్ల…
Wife : జోగుళాంబ గద్వాల జిల్లాలో నవ వరుడి హత్య ఘటన తెలంగాణలో సంచనలం సృష్టిస్తోంది. మృతుడి భార్య ఐశ్వర్య,…
Ration Cards : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పథకం అమలులో మరింత కట్టుదిట్టమైన చర్యలుచేపడుతుంది. ఇటీవల పౌరసరఫరాల శాఖ…
This website uses cookies.