
#image_title
Chiranjeevi – CM Revanth Reddy : ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మ విభూషణ్ పురస్కారం పొందిన ప్రముఖ నటుడు చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పద్మశ్రీ అవార్డులు పొందిన దాసరి కొండప్ప, ఆనందాచారి, కూరెళ్ల విఠలాచార్య, కేతావత్ సోమలాల్, ఉమామహేశ్వరి, గడ్డం సమ్మయ్యలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. ఒక్కొక్కరికి రూ. 25 లక్షల చొప్పున నగదు బహుమతులను అందించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పద్మ పురస్కారాలు పొందిన వారిని సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు హుందాగా ఉండాలన్నారు. వ్యక్తిగత విమర్శలు తగవని అన్నారు. ప్రస్తుత రాజకీయాలలో వ్యక్తిగత విమర్శలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత విమర్శల వల్లే తాను రాజకీయాల నుంచి బయటకు రావాల్సి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
దుర్భాషలు, వ్యక్తిగత విమర్శలు చేసేవాళ్లను ప్రజలు తిప్పకొట్టగలిగితేనే రాజకీయాల్లో కొనసాగ వచ్చేనె పరిస్థితి ఉందని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో వెంకయ్య నాయుడు నిజమైన రాజనీతిజ్ఞుడని కొనియాడారు. మాజీ ప్రధాని వాజ్ పేయి లో ఉన్నంత హుందాతనం ఆయనలో ఉందన్నారు. వెంకయ్య నాయుడు వాగ్దాటికి తాను పెద్ద అభిమానినని వెల్లడించారు. చిన్నతనం నుంచి ఆయన తనకు స్ఫూర్తి అని తెలిపారు. రాజకీయాలలో రోజురోజుకీ దుర్భాషలు ఎక్కువైపోతున్నాయని, నోరు జారి వ్యక్తిగత విమర్శలు చేసే వాళ్లకు బుద్ధి చెప్పే శక్తి ప్రజలకే ఉందని చిరంజీవి హాట్ కామెంట్స్ చేశారు. ఇక నంది అవార్డులకు ప్రజా గాయకుడు గద్దర్ పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం సమక్షితమైందని చిరంజీవి కొనియాడారు.
ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గ సహచరులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అయితే తనకు పద్మభూషణ్ వచ్చినప్పుడు ఉన్నంత సంతోషం పద్మ విభూషణ్ వచ్చినందుకు లేదన్నారు. నేడు తెలుగు సినిమాలు ప్రపంచ స్థాయికి చేరాయని సంతోషం వ్యక్తం చేశారు. పద్మశ్రీ అవార్డులు ప్రకటించాక చాలాసేపటికి పద్మ విభూషణ్ ప్రకటించడం వెనుక ప్రధాని మోదీ వ్యూహం ఉందన్నారు. ముందుగా పద్మశ్రీ అవార్డులు బడుగు బలహీన వర్గాల వారికి ఇవ్వాలని ఆలోచన మోడీదే అని అన్నారు. దీని ఎవరైనా అభినందించాల్సిందేనని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోడీ పట్ల తనకు అత్యంత గౌరవం ఉందని చిరంజీవి తెలిపారు. కళను గుర్తించి అవార్డు ఇవ్వడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని మోడీకి ధన్యవాదాలు చెప్పారు.
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్లో అత్యంత ఆసక్తికర మ్యాచ్లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
This website uses cookies.