Chiranjeevi – CM Revanth Reddy : బూతులు తిడితే చాలు ఈ రోజుల్లో పెద్ద నాయకులై పోతున్నారు.. చిరంజీవి కామెంట్స్ కి సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్

Chiranjeevi – CM Revanth Reddy : ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మ విభూషణ్ పురస్కారం పొందిన ప్రముఖ నటుడు చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పద్మశ్రీ అవార్డులు పొందిన దాసరి కొండప్ప, ఆనందాచారి, కూరెళ్ల విఠలాచార్య, కేతావత్ సోమలాల్, ఉమామహేశ్వరి, గడ్డం సమ్మయ్యలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. ఒక్కొక్కరికి రూ. 25 లక్షల చొప్పున నగదు బహుమతులను అందించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పద్మ పురస్కారాలు పొందిన వారిని సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు హుందాగా ఉండాలన్నారు. వ్యక్తిగత విమర్శలు తగవని అన్నారు. ప్రస్తుత రాజకీయాలలో వ్యక్తిగత విమర్శలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత విమర్శల వల్లే తాను రాజకీయాల నుంచి బయటకు రావాల్సి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

దుర్భాషలు, వ్యక్తిగత విమర్శలు చేసేవాళ్లను ప్రజలు తిప్పకొట్టగలిగితేనే రాజకీయాల్లో కొనసాగ వచ్చేనె పరిస్థితి ఉందని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో వెంకయ్య నాయుడు నిజమైన రాజనీతిజ్ఞుడని కొనియాడారు. మాజీ ప్రధాని వాజ్ పేయి లో ఉన్నంత హుందాతనం ఆయనలో ఉందన్నారు. వెంకయ్య నాయుడు వాగ్దాటికి తాను పెద్ద అభిమానినని వెల్లడించారు. చిన్నతనం నుంచి ఆయన తనకు స్ఫూర్తి అని తెలిపారు. రాజకీయాలలో రోజురోజుకీ దుర్భాషలు ఎక్కువైపోతున్నాయని, నోరు జారి వ్యక్తిగత విమర్శలు చేసే వాళ్లకు బుద్ధి చెప్పే శక్తి ప్రజలకే ఉందని చిరంజీవి హాట్ కామెంట్స్ చేశారు. ఇక నంది అవార్డులకు ప్రజా గాయకుడు గద్దర్ పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం సమక్షితమైందని చిరంజీవి కొనియాడారు.

ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గ సహచరులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అయితే తనకు పద్మభూషణ్ వచ్చినప్పుడు ఉన్నంత సంతోషం పద్మ విభూషణ్ వచ్చినందుకు లేదన్నారు. నేడు తెలుగు సినిమాలు ప్రపంచ స్థాయికి చేరాయని సంతోషం వ్యక్తం చేశారు. పద్మశ్రీ అవార్డులు ప్రకటించాక చాలాసేపటికి పద్మ విభూషణ్ ప్రకటించడం వెనుక ప్రధాని మోదీ వ్యూహం ఉందన్నారు. ముందుగా పద్మశ్రీ అవార్డులు బడుగు బలహీన వర్గాల వారికి ఇవ్వాలని ఆలోచన మోడీదే అని అన్నారు. దీని ఎవరైనా అభినందించాల్సిందేనని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోడీ పట్ల తనకు అత్యంత గౌరవం ఉందని చిరంజీవి తెలిపారు. కళను గుర్తించి అవార్డు ఇవ్వడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని మోడీకి ధన్యవాదాలు చెప్పారు.

Recent Posts

Cancer Tips | ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కాళ్లలో కనిపించే ప్రారంభ సంకేతాలు .. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం

Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్‌, గుండెపోటు, స్ట్రోక్‌…

59 minutes ago

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ఆందోళన .. కాకినాడ తీరంలో కల్లోలం

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…

4 hours ago

Dry Eyes | కళ్ళు పొడిబారడం వ‌ల‌న పెరుగుతున్న సమస్య .. కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు ఇవే

Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…

6 hours ago

Lemon Seeds | అవి పారేయకండి ..నిమ్మగింజల్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే..!

Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…

9 hours ago

Lemons | మూఢనమ్మకాల వెనుక శాస్త్రం ..మూడు బాటల దగ్గర నడవకూడదంటారా?

Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…

11 hours ago

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

23 hours ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

1 day ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

1 day ago