#image_title
Chiranjeevi – CM Revanth Reddy : ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మ విభూషణ్ పురస్కారం పొందిన ప్రముఖ నటుడు చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పద్మశ్రీ అవార్డులు పొందిన దాసరి కొండప్ప, ఆనందాచారి, కూరెళ్ల విఠలాచార్య, కేతావత్ సోమలాల్, ఉమామహేశ్వరి, గడ్డం సమ్మయ్యలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. ఒక్కొక్కరికి రూ. 25 లక్షల చొప్పున నగదు బహుమతులను అందించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పద్మ పురస్కారాలు పొందిన వారిని సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు హుందాగా ఉండాలన్నారు. వ్యక్తిగత విమర్శలు తగవని అన్నారు. ప్రస్తుత రాజకీయాలలో వ్యక్తిగత విమర్శలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత విమర్శల వల్లే తాను రాజకీయాల నుంచి బయటకు రావాల్సి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
దుర్భాషలు, వ్యక్తిగత విమర్శలు చేసేవాళ్లను ప్రజలు తిప్పకొట్టగలిగితేనే రాజకీయాల్లో కొనసాగ వచ్చేనె పరిస్థితి ఉందని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో వెంకయ్య నాయుడు నిజమైన రాజనీతిజ్ఞుడని కొనియాడారు. మాజీ ప్రధాని వాజ్ పేయి లో ఉన్నంత హుందాతనం ఆయనలో ఉందన్నారు. వెంకయ్య నాయుడు వాగ్దాటికి తాను పెద్ద అభిమానినని వెల్లడించారు. చిన్నతనం నుంచి ఆయన తనకు స్ఫూర్తి అని తెలిపారు. రాజకీయాలలో రోజురోజుకీ దుర్భాషలు ఎక్కువైపోతున్నాయని, నోరు జారి వ్యక్తిగత విమర్శలు చేసే వాళ్లకు బుద్ధి చెప్పే శక్తి ప్రజలకే ఉందని చిరంజీవి హాట్ కామెంట్స్ చేశారు. ఇక నంది అవార్డులకు ప్రజా గాయకుడు గద్దర్ పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం సమక్షితమైందని చిరంజీవి కొనియాడారు.
ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గ సహచరులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అయితే తనకు పద్మభూషణ్ వచ్చినప్పుడు ఉన్నంత సంతోషం పద్మ విభూషణ్ వచ్చినందుకు లేదన్నారు. నేడు తెలుగు సినిమాలు ప్రపంచ స్థాయికి చేరాయని సంతోషం వ్యక్తం చేశారు. పద్మశ్రీ అవార్డులు ప్రకటించాక చాలాసేపటికి పద్మ విభూషణ్ ప్రకటించడం వెనుక ప్రధాని మోదీ వ్యూహం ఉందన్నారు. ముందుగా పద్మశ్రీ అవార్డులు బడుగు బలహీన వర్గాల వారికి ఇవ్వాలని ఆలోచన మోడీదే అని అన్నారు. దీని ఎవరైనా అభినందించాల్సిందేనని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోడీ పట్ల తనకు అత్యంత గౌరవం ఉందని చిరంజీవి తెలిపారు. కళను గుర్తించి అవార్డు ఇవ్వడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని మోడీకి ధన్యవాదాలు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల అభ్యున్నతికి వినూత్నమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు రాయితీపై వ్యవసాయ…
AI affect job loss : ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆర్థిక మందగమనం, పెరుగుతున్న ఖర్చులు,…
సాధారణంగా దూర ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి ప్రజలు రైలును ఎంచుకుంటారు. రైలు ప్రయాణంలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు అధికంగా…
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. అర్హత ఉన్నప్పటికీ ఉద్యోగాలు లేనివారికి బెనిఫిషియరీ మేనేజ్మెంట్ స్కీమ్ కింద వర్క్ ఫ్రమ్…
Mobile Offer | ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఒప్పో తాజాగా మరొక బడ్జెట్ 5G ఫోన్తో మార్కెట్ను ఊపేస్తోంది. అత్యాధునిక…
Ganesh Chaturthi Boosts | భక్తి, ఉత్సాహం, రంగురంగుల పందిళ్లు, డీజే మోతలతో దేశమంతటా గణేష్ చతుర్థి ఘనంగా జరుపుకున్నారు. అయితే…
Melbourne Airport | ప్రముఖ మలయాళ నటి నవ్య నాయర్ కు ఆస్ట్రేలియాలోని ఎయిర్పోర్ట్లో ఊహించని అనుభవం ఎదురైంది. ఓనం…
బిగ్బాస్ తెలుగు సీజన్ 9 మునుపెన్నడు లేని విధంగా సరికొత్త కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామనర్స్, సెలబ్రెటీలను బిగ్బాస్…
This website uses cookies.