Sridevi Drama Company : ఈటీవీ లో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమానికి పోటీ అన్నట్లుగా జీ తెలుగు మరియు స్టార్ మా చానల్స్ ఇప్పటికే పలు కార్యక్రమాలను తీసుకు వచ్చి విఫలమయ్యాయి. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న ఈటీవీ లో ప్రసారమవుతున్న జబర్దస్త్ స్థాయిని అందుకోవడం ఏ ఒక్కరి తరం కావడం లేదు. జబర్దస్త్ ని కేవలం జబర్దస్త్ మాత్రమే బీట్ చేయగలదు అన్నట్లుగా వ్యవహారం నడుస్తుంది. స్టార్ మా లో ప్రస్తుతం కామెడీ స్టార్స్ అనే కార్యక్రమం ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే.
మొత్తం జబర్దస్త్ వాళ్ళు వెళ్లి అక్కడ కామెడీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వారి కామెడీ అయితే బాగానే ఉంది కానీ జబర్దస్త్ రేంజిలో షో దూసుకు వెళ్లలేక పోతుంది అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ సమయంలోనే కామెడీ స్టార్స్ తాజా ఎపిసోడ్ లో ఒక స్కిట్ లో శ్రీదేవి డ్రామా కంపెనీ కి సంబంధించిన కాన్సెప్ట్ ను విమర్శిస్తూ కామెడీ చేసే ప్రయత్నం చేశారు. శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో శ్రీమంతం కార్యక్రమాలు.. ఓనీల కార్యక్రమాలు ఇంకా షష్టి పూర్తి కార్యక్రమాలతో పాటు రకరకాల కార్యక్రమాలు చేస్తారు అంటూ కామెడీ చేశారు. ఈ విషయంపై శ్రీదేవి డ్రామా కంపెనీ వారు ఎలా రియాక్ట్ అవుతారో అనేది చూడాలి.
ఒకరిని ఒకరు విమర్శించుకోవడం ఏమాత్రం సరి కాదు.. అది ఏ ఒక్కరూ అంగీకరించరు. ఎవరి కామెడీ షో వారు చేసుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకోవాలని తప్పితే ఒకరిపై ఒకరు ఇలా వ్యంగ్య ప్రచారం చేస్తూ తక్కువ చేస్తూ మాట్లాడుకోవడం సరి కాదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం కామెడీ లో భాగంగా ఇదంతా చేశారు. దాంట్లో ఎలాంటి తప్పులేదు. శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ కమెడియన్స్ వారి పై వారు పంచ్ లు వేసుకుని నవ్విస్తున్నారు. అక్కడ శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి కామెడీ చేసినంత మాత్రాన తప్పేం కాదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళని కామెంట్ చేయడం తో కచ్చితంగా ఈటీవీలో జబర్దస్త్ లేదా శ్రీదేవి డ్రామా కంపెనీ లో స్టార్ మా కామెడీ షో కు సంబంధించిన కౌంటర్ గట్టిగానే పడే అవకాశం ఉందంటున్నారు.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.