RRR Movie : మార్చి 25న విడుదల కానున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. రిలీజ్కి 24 గంటలు సమయం ఉండగా, సందడి అప్పుడే మొదలైంది. ఈ సినిమాను మొదటి రోజు మొదటి షో చూడాలి అని కేవలం అభిమానులు మాత్రమే కాకుండా ఎంతో మంది సినీ ప్రముఖులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే కొంతమంది కోసం చిత్ర యూనిట్ సభ్యులు ప్రత్యేకంగా స్పెషల్ షో లు కూడా వేసినట్లుగా తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఈ సినిమా కోసం జోరుగా ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లు ఏం మాట్లాడని విజయేంద్ర ప్రసాద్ తాజాగా పలు విషయాల గురించి వెల్లడించారు.
ఆర్ఆర్ఆర్ ఆలోచన ఎలా వచ్చిందనే ప్రశ్నకు రాజమౌళి తండ్రి కెవి విజయేంద్ర ప్రసాద్ స్పందిస్తూ ఎవరికీ తెలియని సీక్రెట్స్ రివీల్ చేశారు. రాజమౌళి మొదట మల్టీ స్టారర్ తీయాలని అనుకున్నారని, అయితే మొదట ఎవరినీ పరిగణలోకి తీసుకోకుండా ప్రాజెక్ట్ను ప్రారంభించి, స్క్రిప్ట్ను అభివృద్ధి చేశారట. ఆ తర్వాత కొన్ని రోజులకు రజనీకాంత్-అర్జున్, సూర్య-కార్తీ వంటి స్టార్స్తో పాటు మరికొన్ని కాంబినేషన్లు అనుకున్నారు. అయితే సహజంగానే స్నేహంగా ఉండే స్టార్స్, రెండేళ్లపాటు ఒకరితో ఒకరు కలిసి ఉండే ఇద్దరు హీరోలు కావాలి.
రియల్ లైఫ్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ చాలా సాన్నిహిత్యంగా ఉంటారు కాబట్టి వారిద్దరు అయితే బాగుంటుందని భావించిన రాజమౌళి వెంటనే వీరిద్దరితో ఆర్ఆర్ఆర్ సినిమా ప్లాన్ చేశాడు. ఇదే విషయాన్ని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ఇంకేముంది చెర్రీ, తారక్ ల వల్ల ఆ స్టార్ హీరోలు ‘ఆర్ఆర్ఆర్’ను మిస్సయ్యారు. ఈ ఇద్దరు హీరోల ప్లేస్ లో వేరే హీరోలు వచ్చిన అంత కిక్ ఉండదనేది సగటు ప్రేక్షకుడి అభిప్రాయంగా కనిపిస్తుంది.ఆర్ఆర్ఆర్ సినిమా దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కగా, ఈ సినిమా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబడుతుందని సమాచారం.
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
This website uses cookies.