Home » Entertainment » Deepa Decision After Knowing Truth About Mounitha In Karthika Deepam
Entertainment

Karthika Deepam : తాగిన మైకంలో నిజంగానే కార్తీక్ మోనితతో పడుకున్నాడా? ఆ బిడ్డ నిజంగానే కార్తీక్ బిడ్డేనా? మళ్లీ కార్తీక్, దీప మధ్య ఎడబాటు తప్పదా?  

Authored By
Varun G
The Telugu News | Published on: October 28, 2021, 6:00 pm
Advertisement

Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ ఇప్పుడు నిజంగా బీభత్సమైన ట్విస్ట్ ను తీసుకొచ్చింది. నిన్నటి వరకు మోనిత.. ఆర్టిఫిషియల్ ఇన్ సెమ్యులేషన్ ద్వారా బిడ్డను కంటోందని అనుకున్నారు. కార్తీక్ శాంపిల్స్ తీసుకొని తన గర్భంలో ప్రవేశపెట్టుకున్నదని.. తను చీటర్ అని అంతా అనుకున్నారు. కార్తీక్ తనను ముట్టుకోలేదని.. అదంతా తన ప్లాన్ అని అందరూ నమ్మడంతో కార్తీక్ జైలు నుంచి విడుదలయ్యాడు. అందరూ కార్తీక్ ను నిర్దోషిగా.. మోనితను దోషిగా చూశారు.

Advertisement

deepa decision after knowing truth about mounitha in karthika deepam

కానీ… తనకు పురిటినొప్పులు ప్రారంభం కాగానే.. మోనిత ఇక ఆగలేకపోయింది. తన కడుపులో పుడుతున్న బిడ్డకు తండ్రి కార్తీకే అని సంతకం పెట్టాలని.. అలా అయితేనే ఆపరేషన్ చేయించుకుంటా అని మొండి పట్టు పట్టింది. అలాగే.. కార్తీక్ కు అసలు నిజం కూడా చెప్పేసింది. మనిద్దరం కలిస్తేనే.. నేను నీతో పడుకుంటేనే నాకు ఈ గర్భం వచ్చింది. ఇది సహజంగా వచ్చిన గర్భం. ఆర్టిఫిషియల్ ఇన్ సెమ్యులేషన్ ద్వారా వచ్చిన గర్భం కాదు.. అని మోనిత అసలు నిజం చెప్పడంతో కార్తీక్, సౌందర్య షాక్ అవుతారు.

Advertisement

Karthika Deepam : దీప పరిస్థితి ఏంటి? మళ్లీ దీప బస్తీకి వెళ్లిపోతుందా?

ఇప్పుడు అందరూ ఆలోచించాల్సింది మోనిత గురించో.. మోనితకు పుట్టిన మగ బిడ్డ గురించో లేక సౌందర్య గురించో.. కార్తీక్ గురించో కాదు.. దీప గురించి.. దీప జీవితం గురించి.. ఎందుకంటే.. మోనితను తన భార్యగా.. మోనిత కొడుకును తన కొడుకుగా కార్తీక్ అంగీకరిస్తూ సంతకం పెట్టాడు. దీంతో దీపను అడ్డంగా కార్తీక్ మోసం చేసినట్టే.ఆ విషయం ఇవాళ్టి ఎపిసోడ్ తో తెలిసిపోయింది. మోనితకు కొడుకు పుట్టాడనే విషయం దీప ప్రియమణి ద్వారా తెలుసుకుంది. ఇంటికి వచ్చాక కూడా సౌందర్య, కార్తీక్ కనీసం మోనిత విషయం ఎత్తరు. గుడికి వెళ్లి వస్తున్నామంటూ అబద్ధం చెబుతారు. దీంతో దీపకు మరింత కోపం వస్తుంది.

deepa decision after knowing truth about mounitha in karthika deepam

Advertisement

ఈనేపథ్యంలో దీప.. ఇక ఒక్క క్షణం కూడా ఆ ఇంట్లో ఉండకుండా.. వెళ్లిపోయేందుకు సిద్ధపడుతుందా? అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే దీపకు కనీసం మోనిత విషయం కూడా సౌందర్య, కార్తీక్ చెప్పకపోవడంతో.. కార్తీక్, సౌందర్యను ఈ విషయంపై నిలదీసి.. తన పిల్లలను తీసుకొని వచ్చే ఎపిసోడ్ లో దీప తిరిగి బస్తీకి వెళ్లిపోతుందని తెలుస్తోంది.ఒకవేళ దీప బస్తీకి వెళ్లిపోతే… కార్తీక్, సౌందర్య మోనితను తమ ఇంటికి తీసుకొచ్చే అవకాశం ఉంది. తమకు వారసుడు పుట్టడంతో మోనిత కొడుకును తమ వారసుడిగా స్వీకరించే అవకాశం ఉంది. చూద్దాం మరి.. తరువాయిభాగం శుక్రవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో?

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి