Dil Raju : ఆగస్టు 1వ తారీకున బంద్ అయిన టాలీవుడ్ సినిమా షూటింగ్స్ ఎట్టకేలకు ప్రారంభించేందుకు నిర్ణయించారు. నిర్మాతల గిల్డ్ నుండి పెద్ద ఎత్తున ఒత్తిడి ఉండటంతో ప్రముఖ హీరోల సినిమాలు షూటింగ్ నిలిచి పోయాయి. ఆగస్టులో మహేష్ బాబు.. త్రివిక్రమ్ కాంబోలో సినిమా పట్టాలెక్కాల్సి ఉంది. కానీ ఈ బంద్ కారణంగా షూటింగ్ నిలిచి పోయిన విషయం తెల్సిందే. దిల్ రాజు తాజాగా మీడియా తో మాట్లాడుతూ తాము డిమాండ్ చేసిన కొన్ని కండీషన్స్ కు ఇండస్ట్రీ వారు ఒప్పుకునేందుకు సిద్ధం అయ్యారు. అందుకే సెప్టెంబర్ 1 నుండి షూటింగ్ లు పునః ప్రారంభించేందుకు గాను రెడీ అవుతున్నాం అంటూ దిల్ రాజు మీడియా తో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు.
ఈ బంద్ వల్ల జరిగిన లాభం ఏంటీ అంటే నిర్మాతలు చాలా పెద్ద లిస్ట్ చెబుతున్నారు. సినిమా మేకింగ్ కోసం ఖర్చు తగ్గించుకునేందుకు గాను చాలా నిర్ణయాలు తీసుకున్నాం అన్నారు. అలాగే సినిమా విడుదల అయిన ఎనిమిది వారాల వరకు ఓటీటీ స్ట్రీమింగ్ కు ఒప్పుకునేది లేదు. ఆ విషయాన్ని సీరియస్ గా అమలు చేయబోతున్నట్లుగా కూడా దిల్ రాజు మరియు ఇతర నిర్మాతలు ప్రకటించారు. ఇక నుండి విడుదల అవ్వబోతున్న సినిమాలు కచ్చితంగా ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీ లో స్ట్రీమింగ్ అవ్వాల్సిందే అంటూ టాలీవుడ్ నిర్మాతల కొత్త నిర్ణయం.
ఇక సెప్టెంబర్ 1వ తారీకు నుండి షూటింగ్ లకు నిర్మాతలు సిద్ధం అవుతున్న నేపథ్యంలో స్టార్ హీరోలు అయిన మహేష్ బాబు.. ప్రభాస్.. పవన్ కళ్యాణ్ మరియు చిరంజీవి, బాలకృష్ణ ఇలా అందరి సినిమాలు పట్టాలెక్కబోతున్నాయి. మహేష్ బాబు, త్రివిక్రమ్ల కాంబో మూవీ సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కాబోతుంది. ఇక పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా సెప్టెంబర్ మొదటి వారంలోనే పునః ప్రారంభంకు సిద్ధం అవుతోంది. చిరంజీవి మరియు బాలకృష్ణలు కూడా వారి వారి సినిమాలను పునః ప్రారంభించబతోతున్నారు. అలాగే సలార్ సినిమా షూటింగ్ లో ప్రభాస్ జాయిన్ అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. నెల రోజుల పాటు షూటింగ్ లు లేకపోవడంతో పూర్తి విశ్రాంతి తీసుకున్న స్టార్స్ సెప్టెంబర్ నుండి మళ్లీ మొదలు పెట్టబోతున్నారు.
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
This website uses cookies.