Ammoru : కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా అమ్మోరు. అప్పటి వరకు వచ్చిన కమర్షియల్ అండ్ మాస్, కామెడీ, ఫ్యామిలీ జోనర్ సినిమాలకి భిన్నంగా భక్తి ప్రధానమైన కథాంశంతో అమ్మోరు తెరకెక్కించారు. 1995లో వచ్చిన ఇందులో సౌందర్య, రమ్యకృష్ణ, సురేష్, రామిరెడ్డి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ ఎం. ఎస్. ఆర్ట్ మూవీస్ పతాకంపై ఎం. ఎస్. రెడ్డి సమర్పణలో శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించాడు. ఎం. ఎస్. ఆర్ట్స్ యూనిట్ అమ్మోరు సినిమాకి కథ సిద్ధం చేశారు. దీనికి ప్రముఖ రచయిత సత్యానంద్ మాటలు రాశాడు. తండ్రీ కొడుకులు చక్రవర్తి, శ్రీ కొమ్మినేని అమ్మోరు చిత్రానికి సంగీతాన్నందించారు. ఈ చిత్ర సమర్పకుడైన మల్లెమాల
అమ్మోరులో పాటలు కూడా రాయడం విశేషం.
అయితే ఓ హాలీవుడ్ సినిమాలో ఉన్న గ్రాఫిక్స్ చూసిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి అలా గ్రాఫిక్స్ వాడి తెలుగులో సినిమాను నిర్మించాలనుకున్నారు. తన టీం కి పాయింట్ చెప్పి కథ రాయమని సూచించారు. అలాగే మల్లెమాల యూనిట్ కథ సిద్ధం చేసింది. దీనికి ప్రముఖ దర్శకుడు ఏ కోదండరామి రెడ్డి వద్ద దర్శకత్వ విభాగంలో పని చేస్తున్న రామారావును దర్శకుడిగా పెట్టుకున్నారు. అప్పుడు సౌందర్య మనవరాలి పెళ్ళి అనే సినిమా చేస్తోంది. అందులో బాబు మోహన్ కి మరదలిగా చేసింది. దాంతో బాబు మోహన్ అమ్మోరు సినిమాకి సౌందర్య అయితే పర్ఫెక్ట్ గా సూటవుతుందని శ్యామ్ ప్రసాద్ రెడ్డితో చెప్పగా షూటింగ్ స్పాట్ కి వెళ్ళి ఆమెని చూసి ఓకే చేసుకున్నారు. అలాగే అప్పటి వరకు గ్లామర్ రోల్స్ లో నటించిన రమ్యకృష్ణని అమ్మోరు పాత్రకి ఎన్నుకున్నారు.
మంచి ఫాంలో ఉన్న సురేష్ ని హీరోగా చిన్నాని విలన్ పాత్రకి ఎంచుకున్నారు. 1992లో అమ్మోరు షూటింగ్ ప్రారంభించి 18 నెలలు చిత్రీకరణ జరిపారు. ఆ ఫూటేజ్ తీసుకొని నిర్మాత శ్యామ్ ప్రసాద్ విదేశాలకి వెళ్ళారు. అయితే గ్రాఫిక్స్ కి అది పనికిరాదని వాళ్ళు చెప్పడంతో ఇండియాకి తిరిగి వచ్చేశారు. ఆ ఫుటేజీ మొత్తాన్ని పక్కన పడేసి మళ్ళీ ఫ్రెష్ గా కోడి రామకృష్ణ దర్శకత్వంలో అమ్మోరు సినిమాను మొదలు పెట్టారు. అయితే చిన్నా స్థానంలో రామిరెడ్డిని విలన్ పాత్రకి తీసుకున్నారు. దాదాపు 270 రోజులు ఈ సినిమా చిత్రీకరణ జరిపారు. ఈసారి ఫూటేజీని విదేశాలకి తీసుకు వెళ్ళకుండా అక్కడి వారినే ఇక్కడికి తీసుకువచ్చి గ్రాఫిక్స్ చేయించారు. అద్భుతంగా ఔట్ పుట్ వచ్చింది. 1995 నవంబర్ 23న విడుదలై అఖండ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఇదే జోనర్ లో చాలా సినిమాలొచ్చాయి.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.