#image_title
Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ హౌస్ లో రోజురోజుకూ ఏం జరుగుతోందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. అక్కడ పక్కాగా రెండు గ్రూపులుగా విడిపోయారు. ఒకటి స్టార్ మా గ్రూప్ కాగా, ఇంకోటి శివాజీ గ్రూప్. స్టార్ మా గ్రూపులో ప్రియాంక, అమర్ దీప్, శోభ, ఆట సందీప్, తేజ ఉండగా.. శివాజీ గ్రూప్ లో ప్రశాంత్, యావర్ ఉన్నారు. అయితే.. గౌతమ్, శుభశ్రీ.. ఈ ఇద్దరు మాత్రం ఎవరి గ్రూప్ అవసరం అయితే ఆ గ్రూప్ వైపు వెళ్తారు. ఇక రతిక గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనా స్టార్ మా బ్యాచ్ వల్ల హౌస్ లో చిల్లర పంచాయతీలు మాత్రం పెరుగుతున్నాయి. వాళ్ల వల్లనే చిల్లర లొల్లి జరుగుతోంది. ముఖ్యంగా స్టార్ మా బ్యాచ్ లోని శోభా శెట్టి మాట్లాడితేనే సగటు ప్రేక్షకుడికి చిర్రెత్తుకొస్తోంది. దానికి కారణం.. ఆవిడ ప్రవర్తించే తీరు. వామ్మో.. మాట్లాడితే చాలు.. నోరు నెత్తినపెట్టుకుంటుంది. వామ్మో తల్లి నీతో ఎవ్వరూ పెట్టుకోలేరు. నువ్వు ఎప్పుడు ఎలిమినేట్ అవుతావా అని ఎదురు చూస్తున్నాం అని ప్రేక్షకులు వాపోతున్నారు.
నిజానికి శోభా శెట్టి మూడో వారమే ఎలిమినేట్ కావాల్సి ఉంది. కానీ.. కావాలనే బిగ్ బాస్ శోభా శెట్టి కంటెండర్ టాస్క్ గెలిచినట్టుగా, చివరకు పవరాస్త్రను కూడా శోభా శెట్టి గెలుచుకున్నట్టుగా చేశాడు. దీంతో ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు. దామిని ప్లేస్ లో శోభా శెట్టి ఉండేది. దామిని శోభా శెట్టి కన్నా వంద శాతం నయం అని అంటున్నారు. కానీ.. దామినిని ఎలిమినేట్ చేసి శోభా శెట్టిని మరో మూడు వారాల వరకు సేవ్ చేయడం వెనుక బిగ్ బాస్ ప్లాన్ ఏంటో అర్థం కావడం లేదు. ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ 25వ రోజుకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. అందులో కిచెన్ లో చిల్లర పంచాయతీ పెట్టుకున్నారు కంటెస్టెంట్లు. యావర్ బయటికెళ్లి తింటున్నాడని.. ఇప్పటి వరకు చాలా రోటీలు తిన్నాడని, ఆమ్లెట్ తిన్నాడని, రైస్ కూడా తింటున్నాడని మాస్టర్ మండిపడతాడు. యావర్ లోపలికి రాగానే నువ్వు ఒక్కడివే అక్కడికెళ్లి ఎందుకు తింటున్నావు అని అడుగుతాడు. దీంతో మీకు ఏదైనా సమస్య ఉందా? మీరు కూడా వెళ్లి తినండి అంటాడు. దీంతో శివాజీ కూడా అతడిని సేవ్ చేసే ప్రయత్నం చేస్తాడు. దీంతో ఆ పంచాయతీ కాస్త శివాజీ మీదికి వెళ్తుంది.
#image_title
యావర్ ను అలా మాస్టర్ డైరెక్ట్ గా అడిగే సరికి.. కోపంతో యావర్ ప్లేట్ అక్కడే పెట్టి వెళ్తాడు. దీంతో మాస్టర్ కి ఇంకా కోపం వస్తుంది. శోభా శెట్టికి కూడా కోపం వస్తుంది. ప్లేట్ అలా వదిలి వెళ్లొద్దు అంటుంది శోభా. కానీ.. యావర్ వినడు. ఫుడ్ వేస్ట్ చేయకు అంటాడు మాస్టర్. దీంతో నాకు తినాలనిపించడం లేదు అంటాడు యావర్. ఆమ్లెట్ కావాలంటే చాలామందికి ఇస్తారు కదా అని శివాజీ అంటాడు. ఇక్కడ అందరూ తింటున్నారు కదా. వాడు బర్జర్ దగ్గరే కూర్చొని ఎందుకు తినాలి అంటాడు మాస్టర్. దీంతో నువ్వు కూడా అక్కడ కూర్చొని తిను.. నిన్ను ఎవరు వద్దన్నారు అంటాడు యావర్. జనాలు చూస్తున్నారు కదా. వాళ్లే చూసుకుంటారు అంటాడు శివాజీ. దీంతో ప్రతి సారి జనాలు జనాలు అంటారు మీరు అంటుంది శోభా శెట్టి. దీంతో జనాలు అవసరం లేదు అని నువ్వే అంటావు కదా అని శివాజీ అనడంతో.. ఇదే రాంగ్ గా మీరు జనాల్లోకి నన్ను తీసుకెళ్లాలని అనుకుంటున్నారు అంటుంది శోభా శెట్టి. దానికి సంబంధించిన ప్రోమోను మీరు కూడా చూసేయండి.
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
This website uses cookies.