Colours Swathi : ఒకప్పుడు యాంకర్ అంటే న్యూస్ చదివే వాళ్ళే అనుకునేవాళ్లు. కానీ మా టీవీలో కలర్స్ అనే ప్రోగ్రాం ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది స్వాతి. ముద్దు ముద్దు మాటలతో సరదా కబుర్లు చెబుతూ ఆ షో ని సక్సెస్ఫుల్గా రన్ చేసింది. బుల్లితెరపై ఆ షో సక్సెస్ కావడంతో అప్పటినుంచి ఆమెను కలర్స్ స్వాతి అని పిలుస్తున్నారు. ఈ షో తర్వాత స్వాతి నేరుగా వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. వెంకటేష్ నటించిన ‘ ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే ‘ సినిమాలో త్రిష చెల్లెలుగా నటించి మెప్పించింది.
ఆ తర్వాత నానితో ‘ అష్టాచమ్మా ‘ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్టును అందుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లింది. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం లో కూడా నటించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు వికాస్ వాసు అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమయ్యారు. ఇటీవల సోషల్ మీడియాలో స్వాతి విడాకులపై జోరుగా ప్రచారం జరిగింది. దీనికి స్వాతి విడాకులు తీసుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే చాలా ఏళ్ల తర్వాత స్వాతి ‘ మంత్ ఆఫ్ మధు ‘ అనే సినిమాలో నటించారు.
తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో కలర్స్ స్వాతి పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాం కి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్భంగా స్వాతి సాయి ధరంతేజ్ కు స్టేజి మీదే ముద్దు పెట్టారు. దీంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే వీరిద్దరూ కాలేజీ రోజుల్లో నుంచి మంచి స్నేహితులని తర్వాత తెలిసింది. ఆ సమయంలో సాయి ధరమ్ తేజ్ స్వాతిని స్వాతి గాడు అని పిలిచేవారట. ఈ చనువుతోనే సాయిధరమ్ తేజ్ ని కలర్స్ స్వాతి ముద్దు పెట్టుకోవడం జరిగింది. దీంతో సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి ఓ న్యూస్ హాట్ టాపిక్ గా నడుస్తుంది.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.