Chiranjeevi : చిరంజీవి, గరికపాటి నరసింహారావు మధ్య జరిగిన వివాదం జరిగి రెండు రోజులవుతుంది.. ఇప్పటికీ సోషల్ మీడియాలో దీని గురించి చర్చ జరుగుతూనే ఉంది. అసలు దీని నుంచి ఏం నేర్చుకోవాలి.. ఇద్దరు పెద్ద మనుషుల మధ్య ఏదైనా ఒక వివాదం చెలరేగినప్పుడు దాన్ని ఎలా సద్దుమణిగేలా చేయాలి.. అసలు ఇక్కడ తప్పు ఎవరు చేశారు.. చిరంజీవి ఫ్యాన్స్ కు క్లాస్ తీసుకున్నది ఎవరు? ఇలాంటి విషయాల మీద సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చ జరుగుతుంది ఇప్పుడు. దసరా పండుగ తర్వాత రోజు బండారు దత్తాత్రేయ ఏర్పాటు చేసిన అలాయ్ బలాయ్ కార్యక్రమంలో ఎంతో మంది వీఐపీలు, వీవీఐపీలు, సినీ ప్రముఖులు వచ్చారు. అందులోనే చిరంజీవి, గరికపాటి నరసింహా రావు కూడా ఉన్నారు.
తనను చూడడానికి వచ్చిన అభిమానులతో ఫోటోలు దిగుతున్న మెగాస్టార్ ను చూసి.. గరికపాటి నోరు పారేసుకున్నారు. ఆయన స్టేజి మీదకి వెంటనే వస్తే తప్ప.. నేను మాట్లాడను లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటూ గరికపాటి చేసిన వ్యాఖ్యలు చూసి అందరూ షాక్ అయ్యారు. తర్వాత దీని గురించి సోషల్ మీడియాలో కూడా చర్చ బాగానే జరిగింది. ఇందులో ఎవరిది తప్పు ఉంది అనే విషయంపై కూడా చాలామంది విశ్లేషించారు. అక్కడ జరిగిన పరిస్థితిని బట్టి చాలామంది గరికపాటి తప్పు చేశాడు అనే విషయం స్పష్టంగా చెప్పారు. అయితే చిరంజీవి మాత్రం గరికపాటికి స్టేజి మీద క్షమాపణ చెప్పి తన హుందా తనం చూపించుకున్నాడు. ఈ మొత్తం వ్యవహారంలో ఇద్దరు పెద్ద మనుషుల మధ్య ఏదైనా విషయం చెలరేగినప్పుడు..
దాన్ని ఎలా సద్దుమనిగేలా చేయాలి అనేది చాలామందికి అర్థమైంది. ఎందుకంటే గరికపాటి కూడా చిరంజీవికి క్షమాపణ చెప్పినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇటు చిరంజీవి.. అటు గరికపాటి ఇద్దరూ ఎవరి రంగాల్లో వాళ్ళు నిష్ణాతులు. కాకపోతే చిరంజీవికి కాస్త ఎక్కువ క్రేజ్ ఉన్న మాట మాత్రం వాస్తవం. ఎంతైనా గరికపాటి కూడా మనిషి కాబట్టి ఏదో ఒక సమయంలో అసూయ కలగడం కామన్. మొన్న కూడా ఇదే జరిగింది. ఒక బ్యాడ్ మూడ్ లో ఉన్నప్పుడు ఆయన ఆవేశంలో ఒక మాట అన్నాడు. దాని మెగా ఫాన్స్ అంత పెద్ద విషయం చేయకపోయి ఉంటే అది అక్కడితోనే సద్దుమణిగేది అని కొందరు రివర్స్ లో మెగా ఫాన్స్ పైనే కౌంటర్స్ వేస్తున్నారు.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.