
Guntur Kaaram Movie : ప్రభాస్ కన్నా.. మహేష్ బాబుకి 10 ఎక్కవే వచ్చాయి..!
Guntur Kaaram Movie : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘ గుంటూరు కారం ‘ సినిమాకి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అనుమతిని ఇచ్చింది. నిర్మాతలు సమర్పించిన బడ్జెట్ ఆధారంగా గుంటూరు కారం సినిమాకు టికెట్ పై 50 రూపాయలు పెంచేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రిందట ఆదేశాలు జారీ చేస్తూ జీవో విడుదల చేసింది. ఈ పెంపుతో ఆంధ్ర ప్రదేశ్లో సింగిల్ స్క్రీన్ లో గరిష్ట టిక్కెట్ ధర రూ. 205 రూపాయలైంది. ఇక మల్టీప్లెక్స్ ప్రీమియంలో రూ. 235 మల్టీప్లెక్స్ రిక్లేయినర్స్ లో రూ. 355 రేట్లు ఉండబోతున్నాయి. పెంచిన ధరలు విడుదల డేట్ నుంచి పది రోజులపాటు అమలులో ఉంటాయి. ఎలాంటి అదనపు ఆటలు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వలేదు.
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ప్రభాస్ ‘ సలార్ ‘ సినిమాకు టికెట్ పై 40 రూపాయలు పెంపు ఇచ్చింది ఏపీ సర్కార్. అప్పట్లో ఈ నిర్ణయం ప్రభాస్ అభిమానులను నిరసన తెలిపారు. ఇప్పుడు గుంటూరు కారం సినిమాకు కాస్త ఎక్కువగా టికెట్ పై 50 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. తెలంగాణలో గుంటూరు కారం సినిమాకు భారీగా అనుమతులు ఇచ్చింది. 23 లొకేషన్ లలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చారు. తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ లో 65 రూపాయలు మల్టీప్లెక్స్ లో రూ. 100 పెంపునకు ప్రత్యేక అనుమతి ఇచ్చారు. సినిమాకు ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ప్రతి లోకేషన్లో టికెట్లు 90 శాతానికి పైగా అమ్ముడుపోయాయి. మరి ముఖ్యంగా ఉదయం నాలుగు గంటలకు ఐదు గంటలకు ప్రారంభమైన ఎర్లీ మార్నింగ్ షోలు పూర్తిగా ఫుల్ అయ్యాయి.
ఇక త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. పాటలు సైతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక శ్రీలీల హీరోయిన్ గా నటించారు. ఎప్పటిలాగే తన డాన్స్ తో శ్రీలీల ఊర మాస్ స్టెప్పులు వేశారు. మహేష్ బాబు తో కుర్చీ మడత పెట్టి సాంగ్ డాన్స్ అదిరిపోయింది. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించారు. జనవరి 12న విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. మహేష్ బాబు అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
వేసవి కాలం మొదలైతే శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలు, పానీయాలపై అందరి దృష్టి పడుతుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్,…
Personality Fruit Test : ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన ఇష్టమైన పండు ఉంటుంది. కొందరికి మామిడి అంటే ప్రాణం,…
Summer Breakfast : వేసవి కాలంలో తేలికగా జీర్ణమయ్యే, ఆరోగ్యానికి మేలు చేసే అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివాహితను ప్రేమ…
హైదరాబాద్ ప్రజలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై చిన్న చిన్న మున్సిపల్…
Husbands Wife : ప్రేమ అంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు.. మరణం తర్వాత కూడా ఆ బంధాన్ని…
This website uses cookies.