
AP Survey 2024 : ఏపీలో గెలుపెవరితో తేలిపోయింది .. బయటికి వచ్చిన సంచలన సర్వే..!
AP Survey 2024 : ఏపీలో శాసనసభ ఎన్నికలకు హోరాహోరి ఫైట్ నెలకొంది. వైసీపీ ఒంటరి పోరుకు సిద్ధమైంది. అటు తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకుంది. ఇక వైసీపీ ఎలాగైనా అధికారంలోకి రావాలని పెద్ద ఎత్తున అభ్యర్థులను మారుస్తుంది. ఇక టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటుపై దృష్టి సారించాయి. వీరితో బిజెపి కలుస్తుందా లేదా అన్నది కొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది. మరోపక్క వై.యస్.షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడం ద్వారా బలం పెంచుకోవాలని భావిస్తున్నారు. ఈ తరుణంలో ఏపీ ప్రజల మూడ్ పై తాజాగా ఓ సర్వే బయటకు వచ్చింది. తమ నివేదికలను వెల్లడించింది.
స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అనే సర్వే సంస్థ ఏపీలో ఎవరికీ ఎన్ని సీట్లు వస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేసింది. టీడీపీ, జనసేన కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి..వైసీపీ ఎన్ని స్థానాల్లో గెలుచుకోనుందో అంచనా వేసింది. ఈ సంస్థ గతంలో తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ ఎన్నికల సమయంలో సర్వేలు చేసింది. ఏపీలో సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి ఆదరణ ఉన్నా, ఓట్ల విషయంలో వచ్చేసరికి ఆ స్థాయిలో లేదని తెలియజేసింది. గతంలో మాదిరిగానే ఎన్నికలకు మూడు నెలల ముందే ప్రజా అభిప్రాయాన్ని తెలుసుకుంటున్నట్లు వివరించింది. అయితే రాష్ట్రంలో మూడు రీజియన్లను విభజించి ఫలితాలను వెల్లడించింది.
సర్వే ప్రకారం ఎవరికీ ఎన్ని సీట్లు అంటే :-
* ఉత్తరాంధ్రలో 35 స్థానాలకు వైసీపీకి 12 – 16 స్థానాలు, టీడీపీ, జనసేన కూటమికి 18 – 22 వరకు స్థానాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.
* కోస్తా ఆంధ్రాలో మొత్తం 85 స్థానాలకు వైసీపీకి 19 – 24 , టీడీపీ జనసేన కూటమికి 58 – 65 స్థానాలు వస్తాయని తెలిపింది.
* రాయలసీమలో మొత్తం 55 స్థానాలకు వైసీపీకి 36 – 40 , టీడీపీ, జనసేన కూటమికి 14 – 18 స్థానాలు వస్తాయని అంచనా వేసింది.
అయితే ఈసారి కోస్తాంధ్రలో స్పష్టమైన మెజారిటీ దిశగా టీడీపీ, జనసేన కూటమి అడుగులు వేయటం విశేషం. ఉత్తరాంధ్రలో మాత్రం గట్టి పోటీ నెలకొంది. రాయలసీమలో మాత్రం వైసీపీ గెలవబోతున్నట్లుగా సర్వే తెలిపింది. గత ఎన్నికల్లో వైసీపీ దాదాపుగా వైట్ వాష్ చేసింది. 50 స్థానాలకు గత ఎన్నికల్లో వైసీపీ 52 చోట్ల విజయం సాధించింది. టీడీపీ మూడు స్థానాలకు పరిమితం అయింది. అయితే గత ఎన్నికల కంటే అదనంగా 15 స్థానాల వరకు టీడీపీ జనసేన కూటమి గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే తేల్చి చెప్పింది.
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
వేసవి కాలం మొదలైతే శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలు, పానీయాలపై అందరి దృష్టి పడుతుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్,…
Personality Fruit Test : ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన ఇష్టమైన పండు ఉంటుంది. కొందరికి మామిడి అంటే ప్రాణం,…
Summer Breakfast : వేసవి కాలంలో తేలికగా జీర్ణమయ్యే, ఆరోగ్యానికి మేలు చేసే అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివాహితను ప్రేమ…
హైదరాబాద్ ప్రజలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై చిన్న చిన్న మున్సిపల్…
Husbands Wife : ప్రేమ అంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు.. మరణం తర్వాత కూడా ఆ బంధాన్ని…
This website uses cookies.