Guppedantha Manasu 21 Jan Today Episode : వసుధారకు అన్ని సౌకర్యాలు కల్పించిన రిషి.. మనసు మార్చుకొని వసును దగ్గరికి చేర్చుకుంటాడా?

Advertisement
Advertisement

Guppedantha Manasu 21 Jan Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 21 జనవరి 2023, శనివారం ఎపిసోడ్ 666 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు వసుధార ఏంటి ఇలా చేస్తుంది. ఏమనుకుంటోంది. దీనికి పరిష్కారం లేదా అంటూ దేవయాని సీరియస్ అవుతుంది. దేవయాని.. సమస్య ఎదురైంది. కాస్త ఆలోచించి పరిష్కారం తీసుకోవాలి కదా అంటాడు ఫణీంద్రా. వదిన.. రిషి మనసు గాయం అయింది. ఆ గాయం నుంచి తేరుకోవాలి కదా అంటాడు మహీంద్రా. ఏం తేరుకుంటాడు. ఆ రోజు సాక్షికి ఇచ్చి పెళ్లి చేద్దామంటే మీరు వినలేదు. ఇప్పుడు వసుధార వచ్చి రిషిని వలలో వేసుకుంది. వసుధార నీకు మెసేజ్ పంపించింది ఆలోచిస్తుంటే నిజమే అని నాకు అనిపిస్తోంది. రిషిని వదిలేశారు కదా.. ఆ విషయమే వసుధార ముఖం మీదే చెప్పింది అంటుంది దేవయాని.

Advertisement

guppedantha manasu 21 january 2023 saturday full episode

ఇంతలో రిషి.. జగతికి ఫోన్ చేస్తాడు. దీంతో ఎత్తుతుంది. మేడమ్.. ఒకసారి మీరు కాలేజీకి రండి. నేను మాట్లాడాలి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. దీంతో సరే అంటుంది. ఒకసారి కాలేజీకి రమ్మన్నాడు అక్కయ్య అంటుంది జగతి. సరే పదా అంటాడు మహీంద్రా. దీంతో నువ్వు వద్దు.. నేను ఒక్కదాన్నే వెళ్తాను అంటుంది జగతి. దీంతో ఏం కాదు అందరం వెళ్దాం అని దేవయాని అంటుంది. వద్దు అంటాడు మహీంద్రా. మరోవైపు చక్రపాణిని చూసి ఆశ్చర్యపోతుంది సుమిత్ర. నేను ఇప్పుడు నేల మీదికి వచ్చాను అంటాడు. తనకు పండ్లు కోసి ఇస్తాడు. తిను అంటాడు. నువ్వు తిను అంటాడు. ఇంతలో చక్రపాణికి.. రాజీవ్ ఫోన్ చేస్తాడు. దీంతో ఒరేయ్ మళ్లీ ఎందుకురా ఫోన్ చేస్తున్నావు అంటాడు.

Advertisement

నమస్కారం మామయ్య గారు అంటాడు. దీంతో ఎవడ్రా నీకు మామయ్య.. దౌర్భాగ్యుడా అంటాడు. మా అల్లుడు గారు దేవుడు అన్న మీరే.. ఇలా మాట్లాడుతున్నారా అంటాడు. దీంతో నువ్వు పారిపోయి బతికిపోయావు. నా దగ్గర ఉంటేనా అంటూ సీరియస్ అవుతాడు చక్రపాణి.

మామయ్య గారు ఆవేశపడకండి. అత్తయ్య గారి ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతాడు రాజీవ్. ఒరేయ్.. నువ్వు మాట్లాడుతుంటే నా ఒంటి మీద తేళ్లు, జెర్రీలు పాకినట్టుగా ఉందిరా అంటాడు. ఏం చేస్తారు మామయ్య గారు అంటాడు.

మీ కూతురు చచ్చిపోయి.. మీరు నన్ను చంపితే.. ఉన్న ఒక్క పిల్లాడి పరిస్థితి ఏంటి అంటాడు. దీంతో ఆ పిల్లాడే నీకు ప్రాణభిక్ష పెట్టాడు అనుకోరా అంటాడు. నీతో ఇంతసేపు మాట్లాడటమే తప్పు అంటాడు.

Guppedantha Manasu 21 Jan Today Episode : రాజీవ్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన చక్రపాణి

నా కూతురును ఖచ్చితంగా నువ్వే పొట్టన పెట్టుకొని ఉండి ఉంటావు అంటాడు చక్రపాణి. దీంతో ఇంకో కూతురును ఇవ్వండి మామయ్య గారు. వసును ఇచ్చి పెళ్లి చేయండి. మీ కూతురును గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అంటాడు రాజీవ్.

దీంతో మాట్లాడకు. నువ్వు ఇంకోసారి ఫోన్ చేస్తే చంపేస్తా అంటాడు. ఏంటి మామయ్య గారు.. ఇంకోసారి మీ కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పాలని ఉంది మామయ్య గారు అంటాడు. దీంతో మళ్లీ ఇంకోసారి ఫోన్ చేసినా, వసుధార గురించి మాట్లాడినా నా చేతుల్లోనే నీ చావు ఉందని గుర్తు పెట్టుకో అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు చక్రపాణి.

కట్ చేస్తే కాలేజీ దగ్గర వెయిట్ చేస్తుంటాడు రిషి. ఇంతలో పుష్ప వస్తుంది. ఒక బాక్స్ ఇచ్చి ఏం అనుకోకుండా ఇది వసుధారకు ఇవ్వరా అంటుంది. తను మా ఇంట్లోనే ఉంటోంది సార్ అంటుంది. దీంతో నువ్వు వాళ్ల ఆయనను చూశావా అని అడుగుతాడు.

దీంతో లేదు సార్.. కానీ.. వసుధార లాంటి అమ్మాయి దొరకడం అతడి అదృష్టం అంటుంది. ఇంకా ఏమంటోంది వసుధార అని అంటాడు రిషి. వాళ్ల నాన్న వస్తున్నాడట. వాళ్ల కోసమే ఇల్లు వెతుకుతున్నా అంటుంది.

మరోవైపు జగతి రిషి దగ్గరికి వస్తుంది. వసు ఏది అని అడుగుతుంది. దీంతో ప్రాజెక్ట్ హెడ్ వసుధార వచ్చారు. నన్ను కలిశారు అని చెబుతాడు. జగతికి రూమ్ కీ ఇచ్చి ప్రాజెక్ట్ హెడ్ కు ఇవ్వండి అంటాడు.

గౌతమ్ ఫ్లాట్ కీ. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్ గా సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది. తనకు కావాల్సిన సౌకర్యాలు అన్నీ కల్పించండి అంటాడు. సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్ట్ హెడ్ గారిని గౌతమ్ ఫ్లాట్ లోకి మారమని చెప్పండి అంటాడు.

ఆ తర్వాత పుష్ప ఇచ్చిన బాక్స్ ను.. ప్రాజెక్ట్ హెడ్ కు ఇవ్వండి అని చెబుతాడు రిషి. దీంతో వసుధార దగ్గరికి వెళ్తుంది వసుధార. నేను చేసిన తప్పేంటి మేడమ్ అని అడుగుతుంది వసుధార. దీంతో తప్పొప్పుల గురించి ఇప్పుడు మాట్లాడే అవసరం లేదు అంటుంది జగతి.

మీకు రిషి సార్ ఈ కీ ఇవ్వమన్నారు. అందులో ఉండమన్నారు అని చెబుతుంది జగతి. దీంతో ఆ కీని తీసుకుంటుంది వసుధార. రిషి సార్ ఇవ్వమన్నారా అని సంతోషిస్తుంది. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్ వసుధారకి ఇది ఇవ్వడం బాధ్యత అన్నారు.

ఎంతైనా రిషి సార్ జెంటిల్ మెన్ అని అనుకుంటుంది వసుధార. మరోవైపు అంతా తలకిందులు అయిందని అనుకుంటుంది దేవయాని. ఈ రిషి ఏంటి వెళ్లిపోతాడని అనుకున్నా.. శాశ్వతంగా దూరం అవుతాడని అనుకున్నా. కానీ.. వసుధార మళ్లీ తిరిగి వచ్చింది. రిషి వెళ్లలేదు అని అనుకుంటుంది.

రిషి మళ్లీ కరిగిపోతాడు. పైగా.. జగతిని రమ్మన్నాడు అంటే.. రిషి, జగతిలు కూడా కలిసిపోయేలా ఉన్నారు. అర్జెంట్ గా రాజీవ్ గాడికి ఫోన్ చేయాలి అని అనుకుంటుంది జగతి. ఫోన్ చేస్తుంది. రేయ్.. ఎక్కడ చచ్చావురా అంటుంది.

దీంతో రా ఏంటి.. అంటూ రాజీవ్ కోపంతో మాట్లాడుతాడు. అసలే మంట మీద ఉన్నాను అంటాడు. దీంతో నేను అంతకంటే ఎక్కువ మంట మీదున్నాను.. అంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

17 mins ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

1 hour ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

2 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

11 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

12 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

13 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

14 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

15 hours ago

This website uses cookies.