MS Dhoni : ధోనితో బ్రేకప్ చేదు జ్ఞాపకం.. ఆ హీరోయిన్‌ సంచలన కామెంట్స్..!

Authored By mallesh | The Telugu News | Updated on : 4 December 2021, 9:40 pm

MS Dhoni : మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనికి ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత క్రికెట్ చరిత్రలో ధోని తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. భారత్‌కు ఎన్నో మ్యాచుల్లో విజయం సాధించిపెట్టిన ధోని..1983 తర్వాత కలగా ఉన్న వరల్డ్ కప్ సాధించిపెట్టి భారతీయులు గర్వపడేలా చేశాడు. కాగా, హీరోయిన్ రాయ్ లక్ష్మితో ధోని డేటింగ్‌లో ఉన్నట్లు అప్పట్లో బోలెడన్ని వార్తలు హల్ చల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఆ వార్తలపై రాయ్ లక్ష్మి తాజాగా స్పందించింది. ఈ నేపథ్యంలోనే ధోనిపై సంచలన కామెంట్స్ చేసింది హాట్ హీరోయిన్ రాయ్ లక్ష్మి.ఐపీఎల్ క్రికెట్ మ్యాచెస్ టైంలోనే రాయ్ లక్ష్మితో ధోనికి పరిచయం ఏర్పడిందట. ఆ తర్వాత వీరిరువురు పలు పార్టీలకు వెళ్లారని వార్తలు వచ్చాయి.

ఇక వీరు కొద్ది కాలం పాటు డేటింగ్‌లో ఉండగా, ఆ తర్వాత ఇద్దరు బ్రేకప్ చెప్పేసుకున్నారు. తమ రిలేషన్ షిప్‌పై ఇప్పటికీ వార్తలు రావడం బాధాకరమని రాయ్ లక్ష్మి పేర్కొంది. ధోనీతో తన రిలేషన్ ఓ చేదు జ్ఞాపకమని తెలిపింది రాయ్ లక్ష్మి.తామిరువురుం ఏడాది పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్నామని చెప్పింది. అయితే, ఆ సంవత్సర కాలంలో ఎలాంటి గొడవలు లేవని, ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకున్నామని అంది. ధోనితో తన అఫైర్ గురించి భవిష్యత్తులో కూడా వార్తలు వచ్చేలా ఉన్నాయని, ఆ విషయాలు తనను భయపెడుతున్నాయని చెప్పింది.

heroine sensational comments on MS dhoni

heroine sensational comments on MS dhoni

MS Dhoni : అలా అన్ని రోజుల పాటు రిలేషన్‌లో ఉన్నామని చెప్పిన రాయ్ లక్ష్మి..

భవిష్యత్తులో తన పిల్లలు తమ మధ్య ఉన్న సంబంధం గురించి ప్రశ్నిస్తే ఎలా అని ఆందోళన వ్యక్తం చేసింది రాయ్ లక్ష్మి. ఇకపోతే ధోని తర్వాత తనకు మరో నలుగురు వ్యక్తులతో బ్రేకప్ అయిందని రాయ్ లక్ష్మి తెలిపింది. ఈ సంగతులు అలా ఉంచితే.. చాలా కాలం పాటు స్పెషల్ అప్పియరెన్స్ సాంగ్స్‌లో కనిపించిన రాయ్ లక్ష్మి..ప్రజెంట్ లీడ్ రోల్స్ ప్లే చేస్తోంది. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ‘గ్యాంగ్ స్టర్ 21, ఆనంద భైరవి, ఝాన్సీ ఐపీఎస్, సిండ్రెల్ల, మిరుగ’ చిత్రాల్లో నటిస్తోంది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp