Home » Entertainment » Hyper Aadi Counters On Anchor Rashmi Gautam Anchoring
Entertainment

Rashmi Gautam : యాంకర్ ఉంటుంది కానీ యాంకరింగ్ రాదు.. రష్మీపై ఆది కౌంటర్లు

Authored By
aruna
The Telugu News | Published on: August 2, 2022, 4:40 pm
Advertisement

Rashmi Gautam : బుల్లితెరపై యాంకర్ రష్మీ యాంకరింగ్, ఆమె అందాలు ఎంతగా ఫేమస్ అయ్యాయో అందరికీ తెలిసిందే. మొదట్లో రష్మీ సుధీర్ ట్రాక్ ఎంతగా ఫేమస్ అయిందో.. ఆ తరువాత తరువాత వారి వారి టాలెంట్లతోనే క్రేజ్ సంపాదించుకున్నారు. రష్మీ తనకు తెలుగు రాకపోయినా కూడా ఎంతో కష్టపడింది. నేర్చుకుంది. తెలుగులో మరీ అంత పట్టు సంపాదించుకోలేకపోయినా కూడా మ్యానేజ్ చేస్తోంది. తెలుగులో టాప్ యాంకర్లలో రష్మీ పేరు కూడా ఉంటుంది. అంతలా ఆమె కష్టపడింది. స్టేజ్ మీద తనపై ఎన్ని సెటైర్లు వేసినా, కౌంటర్లతో విసిగించినా కూడా రష్మీ అంతగా పట్టించుకోదు.సుధీర్‌తో లింక్ చేసి ఎన్నో కౌంటర్లు వేస్తుంటారు. తన తెలుగు మీద పంచ్‌లు వేస్తుంటారు.

Advertisement

అయినా రష్మీ మాత్రం ఎప్పుడూ బాధపడదు. ఈ మధ్య శ్రీదేవీ డ్రామా కంపెనీలో ఆది, రాం ప్రసాద్‌లు రెచ్చిపోతోన్నారు. యాంకర్‌గా వచ్చిన రష్మీని ఆట ఆడేసుకుంటున్నారు. కౌంటర్లతో ఆమెకు ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. తాజాగా జరిగిన శ్రీదేవీ డ్రామా కంపెనీ ఎపిసోడ్‌లో రష్మీకి యాంకరింగ్ రాదు అని అనేశాడు ఆది. ఈ ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో సింగర్ మధుప్రియ తన ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొచ్చింది. తన ఫ్యామిలీ ఇలా వచ్చినందుకు.. తమను ఎంటర్టైన్ చేసేందుకు శ్రీదేవీ డ్రామా కంపెనీని పిలిపించుకున్నట్టుకున్నట్టు ఆ ఎపిసోడ్ సాగింది. ఇక మధుప్రియ ఫ్యామిలీని ఎంటర్టైన్ చేసేందుకు ఎపిసోడ్ సాగినట్టు అనిపిస్తోంది. అలా మధుప్రియ రావడంతో..

Hyper aadi Counters On Anchor Rashmi Gautam Anchoring

Advertisement

మధుప్రియ ఊరికి శ్రీదేవీ డ్రామ కంపెనీ రావడంతో ఆది కౌంటర్లు వేశాడు. మీ ఊర్లో ఏం స్పెషల్ అంటూ ఆది అడిగేస్తాడు. ఆమె లేనివి ఉన్నట్టు చెబుతుంది. అలా మధు ప్రియ అనడంతో.. ఆది కూడా కౌంటర్లు వేస్తాడు. యాంకర్ ఉన్నా యాంకరింగ్ రాదు.. కమెడియన్స్ ఉన్నా కామెడీ చేయరు అంటూ పంచ్ వేస్తాడు. అలా మొత్తానికి ఆది మాత్రం రష్మీ మీద యాంకరింగ్ రాదంటూ పంచులు వేస్తాడు. అయినా కూడా రష్మీ సైలెంట్‌గానే ఉంటుంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి