Jabardasth Sowmya Rao : జబర్దస్త్ కొత్త యాంకర్ గా సౌమ్య ఇటీవలే ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆమెను మొదట మూడు లేదా ఐదు ఎపిసోడ్స్ కి మాత్రమే యాంకర్ గా అనుకున్నారు. కానీ జబర్దస్త్ లో ఆమె ఇమిడి పోయింది. ప్రేక్షకులకు నచ్చేసింది. ఎక్కువ శాతం మంది ప్రేక్షకులు ఆమె యాంకరింగ్ ను ఇష్టపడుతున్నారు. అందుకే ఇక నుండి ఆమె జబర్దస్త్ పర్మినెంట్ యాంకర్ గా వ్యవహరించబోతుందని మల్లెమాల వారు పేర్కొన్నారు. జబర్దస్త్ కార్యక్రమంలో కనిపిస్తే చాలు సినిమాల్లో అవకాశాలు వస్తాయని మరో సారి సౌమ్య ద్వారా వెళ్లడైంది.
సౌమ్య ఎంట్రీ ఇచ్చి కనీసం రెండు నెలలు కూడా కాక ముందే అప్పుడే నటిగా ఛాన్స్ దక్కించుకుంది. ఒక యంగ్ హీరో సినిమాలో కీలక పాత్రలో నటించే అవకాశంను ఈ అమ్మడు దక్కించుకుందనే ప్రచారం జరుగుతోంది. మరో వైపు ఒక చిన్న సినిమాలో ఐటెం సాంగ్ చేసే అవకాశాన్ని కూడా ఈమె సొంతం చేసుకుందట. మొత్తానికి జబర్దస్త్ తీసుకు వచ్చిన క్రేజ్ తో వెండి తెరకు ఈమె పరిచయం కాబోతుంది. బుల్లి తెరపై చాలా కాలంగా ఈమె సందడి చేస్తోంది, కానీ జబర్దస్త్ ద్వారా వచ్చినంత పాపులారిటీ ఎప్పుడు కూడా ఈమెకు రాలేదు.
భారీ అంచనాల నడుమ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించింది. కనుక ముందు ముందు ఈమెకు మరిన్ని ఛాన్సులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. జబర్దస్త్ తో పాటు ఈటీవీలోనే ప్రసారమవుతున్న పలు కార్యక్రమాల్లో కూడా సౌమ్య సందడి చేసే అవకాశం ఉంది. మరో వైపు సినిమాల్లో కూడా అనసూయ మాదిరిగా బిజీ అయ్యి అవకాశం ఉంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం చేస్తున్నారు. సౌమ్య అందంగా ఉండటంతో పాటు చలాకీగా మాట్లాడుతుంది కనుక ఈ క్రేజ్.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.