
veera-simha-reddy-hit-chiranjeevi-not-satisfied-valter-veeraiah-movie-makers
Veera Simha Reddy : సంక్రాంతి కానుకగా బాలయ్య ‘ వీరసింహారెడ్డి ‘ సినిమా ఈరోజు గ్రాండ్ గా విడుదలై పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఇక కొద్ది రోజుల్లోనే ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతుందని అంచనా. ఇక బాలయ్య సినిమాతో పాటు చిరంజీవి ‘ వాల్తేరు వీరయ్య ‘ సినిమా రేపు విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలలో చిరంజీవి మైత్రి నిర్మాతల గురించి ప్రత్యేకంగా చెప్పారు. ఈ సినిమాలో బాస్ పాట కోసం భారీగా సెట్ వేయించారని, ఆ పాట బాగా వచ్చిన దానికోసం అంత ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. సినిమా కథ బాగుంటే అదే సూపర్ హిట్ అవుతుందని చెప్పారు.
సినిమా మేకింగ్ నిర్మాతలు చాలా జాగ్రత్తగా ఉండాలి. డైరెక్టర్స్ కూడా సినిమా బాగా వచ్చేలా చూసుకోవాలి అని అన్నారు. బాస్ పార్టీ సాంగ్ సెట్ కోసం మైత్రి నిర్మాతలు భారీ మొత్తాన్ని ఖర్చు పెట్టారు. ఆ సెట్ వేసే ముందు నాతో చెప్పి ఉంటే నేను వద్దనే వాడిని అని అన్నారు. అయితే ఈ పాట సెట్ వావ్ అనిపించేలా ఉందని చెప్పారు. మైత్రి నిర్మాతలు మొదటి నుంచి వారి ప్రొడక్షన్లో సినిమాలను భారీ మొత్తంలో ఖర్చు చేస్తూ నిర్మిస్తుంటారు. సినిమా గ్రాండ్ లుక్ రావడం కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడరు. అందుకే చాలామంది స్టార్ హీరోలు ఈ సంస్థతో వరుస సినిమాలు చేస్తున్నారు.
veera-simha-reddy-hit-chiranjeevi-not-satisfied-valter-veeraiah-movie-makers
ఈ నిర్మాణ సంస్థకు సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉంది. దీనికి కారణం సినిమా కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేయడమే. మైత్రి మూవీ మేకర్స్ నుంచి వాల్తేరు వీరయ్య మరో భారీ సినిమా అని తెలుస్తుంది. చిరంజీవి రవితేజ ల మధ్య వచ్చే సీన్స్ కి అభిమానులు విజిల్స్ వేసి గోల గోల చేస్తారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వం వహించారు. డైరెక్టర్ బాబి ఈ సినిమాపై పూర్తి నమ్మకం పెట్టుకున్నాడు. మరి వీరు చెప్పిన మాటలు చూస్తే సినిమా హిట్ అవుతుందని అనిపిస్తుంది. ఇది నిజమో కాదో తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూస్తే వాల్తేరు వీరయ్య సినిమా రిజల్ట్ ఏంటో తెలుస్తుంది.
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్లకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
This website uses cookies.