Janaki Kalaganaledu 22 Nov Episode : మైరావతికి అవమాన భారం.. ఆమెతో మాట్లాడేందుకొచ్చిన జ్ఞానాంబ.. తర్వాత ఏమైందంటే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Janaki Kalaganaledu 22 Nov Episode : మైరావతికి అవమాన భారం.. ఆమెతో మాట్లాడేందుకొచ్చిన జ్ఞానాంబ.. తర్వాత ఏమైందంటే?

Janaki Kalaganaledu 21 Nov Episode : బుల్లితెరపై సందడి చేస్తున్న సీరియల్స్‌లో ఒకటైన ‘జానకి కలగనలేదు’. బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ హీరోయిన్‌ అని చెప్పొచ్చు. రోజురోజుకూ సీరియల్ కథలో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా ఎపిసోడ్స్ ఇంకా ఆసక్తికరంగా మారుతున్నాయి.ఎప్పుడూ తన మాట వినే జ్ఞానాంబ తన మాట వినకుండా పూజ జరిపించడంతో మైరావతి ఆగ్రహం వ్యక్తం చేసింది. పూజ జరుగుతున్న టైంలోనే పూజ వద్దు ఆపేస్తున్నానని చెప్పి మధ్యలోనే మైరావతి వెళ్లిపోయింది.దాంతో జ్ఞానాంబ […]

 Authored By mallesh | The Telugu News | Updated on :20 November 2021,1:40 pm

Janaki Kalaganaledu 21 Nov Episode : బుల్లితెరపై సందడి చేస్తున్న సీరియల్స్‌లో ఒకటైన ‘జానకి కలగనలేదు’. బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ హీరోయిన్‌ అని చెప్పొచ్చు. రోజురోజుకూ సీరియల్ కథలో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా ఎపిసోడ్స్ ఇంకా ఆసక్తికరంగా మారుతున్నాయి.ఎప్పుడూ తన మాట వినే జ్ఞానాంబ తన మాట వినకుండా పూజ జరిపించడంతో మైరావతి ఆగ్రహం వ్యక్తం చేసింది.

పూజ జరుగుతున్న టైంలోనే పూజ వద్దు ఆపేస్తున్నానని చెప్పి మధ్యలోనే మైరావతి వెళ్లిపోయింది.దాంతో జ్ఞానాంబ వెళ్లి పూజకు రావాలని కోరుతుంది. అయితే, తాను ఒక్కసారి డెసిషన్ తీసుకుంటే అదే ఫైనల్ అని, మళ్లీ మార్చుకోనని అంటుంది మైరావతి. అయితే, మైరవావతి రాకపోయినప్పటికీ పూజ జరుగుతుందని జ్ఞానాంబ అంటుంది. దాంతో మైరావతి షాక్ అవుతుంది. తనను ఎదిరించి మరి పూజ జరిపిస్తుందా అని అనుకుంటుంది.

janaki kalaganaledu 22 november 2021 episode

janaki kalaganaledu 22 november 2021 episode

Janaki Kalaganaledu 21 Nov Episode : జ్ఞానాంబ రాగానే ఆమెను తిట్టిన మైరావతి..

ఈ విషయమై మైరావతి జ్ఞానాంబపై ఫైర్ అవుతుంది. అయితే, తాను ఇంటికోడలిగా బాధ్యతగా పూజ జరిపిస్తున్నానని, అది ఎదిరించి చేసినట్లు కాదని, మామయ్య ఆత్మ శాంతి కోసమే జరిపిస్తున్నటు వంటి పూజని జ్ఞానాంబ అంటుంది. అమ్మ మాటకు గౌరవం ఇవ్వాలని గోవిందరాజు అంటాడు. కానీ, ఇంటి క్షేమం కోసం తప్పదు కదా అని అంటుంది జ్ఞానాంబ. అలా పూజ మొదలవుతుంది. పూజ పూర్తి కావస్తుంది కూడా.

ఇక పూజ అయిన తర్వాత మైరావతి ఆశీర్వాదం తీసుకునేందుకుగాను ఆమె వద్దకు వెళ్లాలని జానకి, రామాను వెళ్లాలని జ్ఞానాంబ చెప్తుంది. అయితే, తన వద్దకు ఎవరూ రావొద్దని, తన కోడలు తన మాట వినడం లేదని మైరావతి బాధపడిపోతుంది. తన డెసిషన్‌ను తన కోడలే అవమానించిందని అవమాన భారంతో మైరావతి నలిగిపోతుంది. ఇంతలోనే సీన్ కట్ అయి నెక్స్ట్ సీన్ కంటిన్యూ అవుతుంది.

మైరావతి మామిడికాయ పచ్చడి తయారు చేసేందుకుగాను మామిడికాయలు కోస్తుంటుంది. అంతలోనే అక్కడకు వచ్చి జ్ఞానాంబను చూసి గోదారిని తిడుతుంది మైరావతి. జ్ఞానాంబ మైరావతితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా ఆసక్తికర ఘటన జరగబోతుందనే సంకేతాలు వస్తుండగానే ఎపిసోడ్ ముగిస్తుంది. అసలేం జరిగింది తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేంత వరకు ఆగి చూడాల్సిందే.

Tags :

    mallesh

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది