
janaki kalaganaledu 24 october 2022 full episode
Janaki Kalaganaledu 24 Oct Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 24 అక్టోబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 416 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్ఞానాంబ తన కోడళ్లతో కలిసి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తుంది. పంతులు గారు ప్రసాదం అమ్మవారికి సమర్పించి మా కుటుంబం పేరు మీద పూజ చేయండి అంటుంది జ్ఞానాంబ. ఇంతలో పంతులు గారు నా పేరు మీద, నా భర్త పేరు మీద సపరేట్ గా పూజ చేయండి అంటుంది మల్లిక. దీంతో అందరూ షాక్ అవుతారు. పంతులు కూడా షాక్ అవుతాడు. అక్కడ ఉన్న ఊరి వాళ్ల ముందు మల్లిక అలా మాట్లాడిందేంటి అని అంతా అనుకుంటారు. అదేంటమ్మా.. మీరు ఎప్పుడూ సకుటుంబ సమేతంగా పూజ చేయించుకుంటారు కదా. ఇప్పుడు ఏంటి మీరు సపరేట్ గా పూజ చేయించుకుంటున్నారు అని అడుగుతాడు.
janaki kalaganaledu 24 october 2022 full episode
దీంతో మల్లిక రేపటి నుంచి మేము విడిపోతున్నాం అంటూ ఏదో చెప్పబోగా ఇంతలో జానకి.. ఆమె కడుపుతో ఉంది కదా.. కడుపులోని బిడ్డతో సహా పూజ చేయండి అని చెబుతుంది. అలాగే.. జెస్సీ కూడా కడుపుతో ఉంది. తనకు కూడా సపరేట్ గా పూజ చేయండి అంటుంది జానకి. దీంతో సరే అంటాడు పంతులు. అది కాదు పంతులు గారు నేను చెప్పేది వినండి అంటూ ఏదో చెప్పబోగా అస్సలు వినిపించుకోకుండా జానకి గంట మోగిస్తుంది. ఆ తర్వాత పూజారి పూజ చేస్తాడు. తల్లి మా కుటుంబం అంతా ఎప్పుడూ కలిసి ఉండేలా దీవించు అని మొక్కుతుంది జ్ఞానాంబ. జానకి కూడా అదే మొక్కుకుంటుంది. ఆ తర్వాత పూజ అయిపోతుంది.
పూజ అయిపోయాక అందరూ బయటికి వస్తారు. అమ్మా మల్లిక.. నోటి మాటలను అదుపులో పెట్టుకో అమ్మ. లేకపోతే నీ పరువే పోతుంది అని సలహా ఇస్తాడు గోవిందరాజు. కానీ.. మల్లిక అదేమీ పట్టించుకోదు.
ఇంతలో జ్ఞానాంబ ఫ్యామిలీకి మరో ఫ్యామిలీ ఎదురు పడుతుంది. వాళ్లంతా నమస్కారం అంటారు. బాగున్నారా అమ్మా అంటారు జ్ఞానాంబ ఫ్యామిలీని చూసి. మీ అందరినీ ఇలా చూసినా.. మీరు పాటించే ఉమ్మడి కుటుంబాన్ని తలుచుకున్నా మాకు ఎంతో సంతోషంగా, ప్రేరణగా అనిపిస్తుంది అంటారు.
మేమంతా ఇలా కలిసిమెలిసి ఉంటున్నామంటే దానికి కారణం మీరే జ్ఞానాంబ గారు అంటారు. మేము ఎప్పుడూ చెప్పే జ్ఞానాంబ గారు ఈవిడే. ముందు మీరు వెళ్లి ఆవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. వెళ్లండి అని ఆయన తన కొడుకులకు చెబుతాడు. పిల్లలు కూడా వెళ్లి తన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు.
అసలు వీళ్లు ఎవరు. ఈ కుటుంబం మా వల్ల కలిసి ఉండటం ఏంటి అని అనుకుంటుంది జ్ఞానాంబ. మా దృష్టిలో మీరు దేవతతో సమానం అంటారు. మా జ్ఞానం వల్ల మీరు ఏమైనా సాయం పొందారా అని అడుగుతాడు గోవిందరాజు.
దీంతో వెలకట్టలేని ఉమ్మడి కుటుంబం గురించి తెలుసుకున్నాం. మేము మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నాం అని అంటారు వాళ్లు. ఉమ్మడి కుటుంబం ఎంత గొప్పదో.. కలసి మెలిసి ఉంటే ఎంత మంచిదో తెలుసుకొని మేమంతా కలిసి మెలిసి ఉంటున్నాం.. అంటాడు తన కొడుకు.
లేదంటే మేమంతా ఎవరికి వారు విడిపోయి చెట్టుకు ఒకరు పుట్టకు ఒగరుగా జీవితంలో సంతోషం లేకుండా దేనికి పనికిరాకుండా అయిపోయేవాళ్లం అంటారు వాళ్లు. వీళ్ల మాటలు వింటుంటే.. విడిపోయి ఉండటం వల్ల వీళ్లు ఏదో సమస్యను ఎదుర్కున్నట్టు ఉంది అని అనుకుంటుంది జానకి.
ఉమ్మడి కుటుంబంలోని విలువలు మీకు ఇంత గొప్పగా తెలిశాయి అంటే.. మీరు విడిపోవడం వల్ల మీకు ఎలాంటి సమస్యలు వచ్చాయి అని అడుగుతుంది జానకి. దీంతో విడిపోతే వచ్చే కష్టాలు ఏంటో మీకు తెలియదా తల్లి అంటుంది ఆవిడ.
కరెక్టే కానీ.. విడిపోవడం వల్ల వచ్చే కష్టాలు కూడా తెలవాలి కదా అంటుంది. దీంతో ఏ ఇంట్లో అయినా ఉమ్మడి కుటుంబంగా ఉండాలన్నా, విడిపోవాలన్నా కూడా ఆ ఇంటి కోడలు మీదనే ఆధారపడి ఉంటుంది అని అంటుంది ఆ ఇంటి కోడలు.
మా కోడళ్లం ఇద్దరం తప్పు చేశాం. మేమే బాగుండాలన్న స్వార్థం.. వీళ్ల పెత్తనం ఏంటి అనే అహం వల్ల మేము విడిపోయాం. అప్పుడు కానీ.. మాకు అసలు విషయం గుర్తుకురాలేదు. ఉమ్మడి కుటుంబంలో ఉంటే ఎంత మంచిదో అప్పుడు అర్థం అయింది అంటారు.
మేము వేరు కాపురం పెట్టుకున్నాక ఎవ్వరి నుంచి మాకు ఎలాంటి సాయం లేదు. కష్టం వస్తే అందించే చేయి లేదు.. తోడు ఉండే మనిషి లేడు అంటారు. సమాజం వెలేసిన బతుకు అయిపోయింది మా పరిస్థితి అంటారు.
ఎన్నో అవమానాలు ఎదుర్కున్నాం. మా పిల్లలను మేమే చూసుకోవాలి. లేదంటే అనాథ పిల్లలలా కేర్ సెంటర్ కు వదిలేయాలి అంటారు. అటు మా అత్తయ్య గారు, మామయ్య గారు పిల్లల మీద అచ్చటా ముచ్చట దొరకగా చాలా సమస్యలు వచ్చాయి.
అప్పుడే మా మామయ్య గారు మీ కుటుంబం గురించి చెప్పారు. మాకు ఉమ్మడి కుటుంబం వల్ల లాభాలేంటో కనువిప్పు కలిగించారు. దీంతో మేము ఇప్పుడు కలిసి పోయి సంతోషంగా ఉన్నాం అని చెబుతారు.
ఆ తర్వాత అందరూ ఇంటికి వెళ్తారు. బయటి వాళ్లకు ఆదర్శం అయిన ఈ కుటుంబం.. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో లేదు అని అనుకుంటుంది జ్ఞానాంబ. తొందరపడ్డామేమో అని అనుకుంటాడు విష్ణు.
అఖిల్ కూడా అనవసరంగా ఆవేశ పడ్డాను అని అనుకుంటాడు. మనమంతా ఒక్కటే అనుకుంటే ఏ సమస్యా రాదు అని అని మల్లికతో అంటుంది జానకి. ఇందాక వాళ్లు చెప్పింది విన్నావు కదా. మనందరినీ ఆదర్శంగా తీసుకొని వాళ్లు కలిసి మెలిసి ఉంటున్నారు.
విడిగా ఉంటే పట్టించుకునే వాళ్లు ఉండరు. అందరూ ఉండి అనాథల్లా ఉంటాం. ఒక్కసారి ఆలోచించు అంటుంది జానకి. ఆ తర్వాత అఖిల్ కు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది జానకి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Non Veg Summer : వేసవి కాలం వచ్చిందంటే చాలు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంటాడు. బయట అడుగు పెట్టాలంటేనే…
Chanakya Niti : భారతీయ చరిత్రలో ఆచార్య చాణక్యుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన చెప్పిన నీతులు, సూత్రాలు…
LPG Price Hike 2026 : కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) ప్రారంభమైన ఏప్రిల్ 1వ తేదీనే చమురు కంపెనీలు…
Telangana తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఏళ్ల తరబడి అహర్నిశలు శ్రమిస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ Contract…
Carmeni Selvam Movie : పాత్వే ప్రొడక్షన్స్ బ్యానర్పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో తెలుగు, తమిళ…
Israel : ఈ ప్రపంచంలో Israel మనిషి తనను తాను సర్వజ్ఞానిగా భావిస్తాడు. తన దగ్గర ఉన్న సైన్స్ మరియు…
Russia India United States : ఈ మధ్య కాలంలో మధ్య ప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే అమెరికా మరియు…
Raghav chadda : దేశంలో విమాన ప్రయాణం అంటే ఒకప్పుడు ధనికులకు మాత్రమే పరిమితం అనుకునేవారు కానీ ఇప్పుడు కాలం…
April Fools Day : ఏప్రిల్ 1 వచ్చిందంటే చాలు... స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆఫీసులో తోటి ఉద్యోగులు ఒకరినొకరు…
Telangana Chicken Shops Strike : మాంసాహార ప్రియులకు, ముఖ్యంగా చికెన్ అంటే ప్రాణం పెట్టే తెలంగాణ వాసులకు ఇది…
Kodali Nani : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా…
Gold Silver Rate April 1st 2026 : పసిడి ప్రియులకు, సామాన్య కొనుగోలుదారులకు బులియన్ మార్కెట్ నుంచి వరుస…
This website uses cookies.