Koratala Siva : వరుస విజయాలలో ఉన్న దర్శకుడు కొరటాల శివ మెగా మల్టీస్టారర్ ఆచార్య సినిమా చేసి మొదటిసారి కెరీర్లో ఫ్లాప్ అందుకున్నారు. కొరటాల మార్క్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా చేసినా అందులో మెగా హీరోలు చేసిన పలు మార్పులు వల్ల కథ, కథనం మారిపోయి కథలో పస లేకుండా పోయింది. ఇద్దరు మెగా హీరోలు స్క్రీన్ మీద కనిపించినా కూడా కనీసం మెగా అభిమానులను కూడా మెప్పించలేకపోయింది ఆచార్య చిత్రం. మణిశర్మ సంగీతం రెజీనా, సంగీతల స్పెషల్ సాంగ్స్ అన్నీ ఉన్నా కలిసి రాలేదు. నిజంగా మెగా ఫ్యామిలీ హీరోలకు ఇది షాక్ అని చెప్పక తప్పదు.
నిర్మాత – డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయినా కూడా దాన్ని మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. అలాగే, దర్శకుడు కొరటాల శివ తమ రెమ్యునరేషన్లో చాలావరకు తిరిగి ఇచ్చేశారు. ఎంతో కొంత నిర్మాత, డిస్ట్రిబ్యూట్స్ను ఆదుకున్నారు. అది కాదు సమస్య..భారీ మల్టీస్టారర్గా వచ్చిన ఆచార్య మెగా హీరోల ఖాతాలో హిట్గా చేరలేకపోయింది. దాంతో దర్శకుడు కొరటాల శివ ఏకంగా తన సక్సెస్ ఫార్ములా అయినా మేసేజ్ ఓరియెంటెడ్ జోనర్ను వదిలేయనున్నట్టు తాజాగా టాక్ వినిపిస్తోంది. అందుకే, కొరటాల యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా చేయబోతున్న సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందించాలని చూస్తున్నారట.
మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను..ఇటీవల వచ్చిన ఆచార్య సినిమాలన్నిటిలోనూ కొరటాల ఏదో ఒక సోషల్ మెసేజ్ ఇచ్చారు. వీటిలో ఆచార్య తప్ప మిగతా నాలుగు సినిమాలు ఆ మేసేజ్ జనాలకు విపరీతంగా నచ్చి భారీ హిట్ అయ్యేందుకు కలిసొచ్చింది. అయినా ఆచార్య సినిమాను దృష్ఠిలో పెట్టుకొని ఈసారి ఎన్టీఆర్ 30వ సినిమాలో మెసేజ్ కంటే కూడా కంప్లీట్ ఫ్యామిలీ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా స్క్రిప్ట్ సిద్ధం చేశారట. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చే సినిమా కొరటాల శివదే. కాబట్టి, పాన్ ఇండియా లెవల్లో సినిమాను ప్లాన్ చేస్తున్నారు. మరి కొరటాల తన మార్క్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా కాకుండా కమర్షియల్ సినిమా అంటే అది ఎలా ఉంటుందో..జనాలకు ఎంతవరకు ఎక్కుతుందో చూడాలి.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.