Krishnam Raju : రెబల్ స్టార్ కృష్ణం రాజు గారు రీసెంట్గా కాలం చేసిన విషయం తెలిసిందే. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు. కృష్ణం రాజు గారు తుదిశ్వాస విడిచారని తెలిసి స్టార్ హీరోలు, నటీనటులు, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో రెబల్ స్టార్ అంత్యక్రియలు నిర్వహించగా.. ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, హీరో ప్రభాస్ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ దృశ్యాలు అందరినీ కలిచివేశాయి.
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణం రాజు సెప్టెంబర్ 11వ తేదిన ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచాడు. ఆయనకు కిడ్నీ సమస్యతో ఆస్పత్రిలో జాయిన్ అవ్వగా.. గుండెపోటుతో మరణించాడని వైద్యులు వెల్లడించారు. తెలుగు చిత్రపరిశ్రమకు కృష్ణంరాజు చాలా సేవలు అందించారు. విలక్షణమైన పాత్రల్లో మెప్పించిన ఆయన..నిర్మాతగా కూడా గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇండస్ట్రీలో రెబల్ స్టార్ వారసుడిగా ప్రభాస్ ప్రస్తుతం స్టార్ హీరోగా ఎదిగాడు. బాహుబలి సినిమా అనంతరం ప్రభాస్ ఏకంగా పాన్ ఇండియన్ స్టార్ గా అవతరించాడు.కృష్ణం రాజుగారికి ముగ్గురు కూతుర్లు ఉన్నారు. అందుకే తన వారసుడిగా ప్రభాస్ను ప్రకటించాడు. ఇక ప్రభాస్ పెళ్లి చూడటం తన కల అని చాలా సార్లు చెప్పుకొచ్చిన ఆయన.. తన చివరి కోరిక నెరవేరకుండానే కన్నుమూశాడు.
కృష్ణంరాజు గారి పెద్ద కూతురు సాయి ప్రసీదా ఇండస్ట్రీలోకి నిర్మాతగా రాణిస్తున్నారు. రాధే శ్యామ్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన ప్రసిదా.. భారీగా నష్టపోయిందట..ఈ సినిమాకు ఏకంగా రూ.350 కోట్లు ఖర్చు పెట్టిన మూవీ మేకర్స్.. హిట్ అవుతుందని చాలా అంచనాలు పెట్టుకున్నారు. కానీ అనుకోకుండా సినిమా ప్లాప్ కావడంతో సుమారు రూ.100కోట్లు లాస్ వచ్చిందట.. దీంతో రాజుగారు తన కూతురి భవిష్యత్ కోసం ఆ వంద కోట్ల నష్టాన్నిఆయనే భరించారట.. దీనికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతుండగా.. ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియాల్సి ఉంది.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.