Krishnam Raju : ప్రభాస్ కోసం చెల్లెలి సాహసం.. రూ.100 కోట్లు పోగొట్టుకున్న కృష్ణంరాజు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Krishnam Raju : ప్రభాస్ కోసం చెల్లెలి సాహసం.. రూ.100 కోట్లు పోగొట్టుకున్న కృష్ణంరాజు?

Krishnam Raju : రెబల్ స్టార్ కృష్ణం రాజు గారు రీసెంట్‌గా కాలం చేసిన విషయం తెలిసిందే. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు. కృష్ణం రాజు గారు తుదిశ్వాస విడిచారని తెలిసి స్టార్ హీరోలు, నటీనటులు, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో రెబల్ స్టార్ అంత్యక్రియలు నిర్వహించగా.. ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, హీరో ప్రభాస్ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ దృశ్యాలు అందరినీ కలిచివేశాయి. Krishnam Raju : కూతురి […]

 Authored By mallesh | The Telugu News | Updated on :21 September 2022,1:30 pm

Krishnam Raju : రెబల్ స్టార్ కృష్ణం రాజు గారు రీసెంట్‌గా కాలం చేసిన విషయం తెలిసిందే. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు. కృష్ణం రాజు గారు తుదిశ్వాస విడిచారని తెలిసి స్టార్ హీరోలు, నటీనటులు, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో రెబల్ స్టార్ అంత్యక్రియలు నిర్వహించగా.. ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, హీరో ప్రభాస్ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ దృశ్యాలు అందరినీ కలిచివేశాయి.

Krishnam Raju : కూతురి పొరపాటును సరిదిద్దిన తండ్రి..

గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణం రాజు సెప్టెంబర్ 11వ తేదిన ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచాడు. ఆయనకు కిడ్నీ సమస్యతో ఆస్పత్రిలో జాయిన్ అవ్వగా.. గుండెపోటుతో మరణించాడని వైద్యులు వెల్లడించారు. తెలుగు చిత్రపరిశ్రమకు కృష్ణంరాజు చాలా సేవలు అందించారు. విలక్షణమైన పాత్రల్లో మెప్పించిన ఆయన..నిర్మాతగా కూడా గుర్తింపు సంపాదించుకున్నారు.

Krishnam Raju Daughter Praseeda Got Loss In Prabhas Radhe Shyam Movie

Krishnam Raju Daughter Praseeda Got Loss In Prabhas Radhe Shyam Movie

ఇండస్ట్రీలో రెబల్ స్టార్ వారసుడిగా ప్రభాస్ ప్రస్తుతం స్టార్ హీరోగా ఎదిగాడు. బాహుబలి సినిమా అనంతరం ప్రభాస్ ఏకంగా పాన్ ఇండియన్ స్టార్ గా అవతరించాడు.కృష్ణం రాజుగారికి ముగ్గురు కూతుర్లు ఉన్నారు. అందుకే తన వారసుడిగా ప్రభాస్‌ను ప్రకటించాడు. ఇక ప్రభాస్ పెళ్లి చూడటం తన కల అని చాలా సార్లు చెప్పుకొచ్చిన ఆయన.. తన చివరి కోరిక నెరవేరకుండానే కన్నుమూశాడు.

కృష్ణంరాజు గారి పెద్ద కూతురు సాయి ప్రసీదా ఇండస్ట్రీలోకి నిర్మాతగా రాణిస్తున్నారు. రాధే శ్యామ్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన ప్రసిదా.. భారీగా నష్టపోయిందట..ఈ సినిమాకు ఏకంగా రూ.350 కోట్లు ఖర్చు పెట్టిన మూవీ మేకర్స్.. హిట్ అవుతుందని చాలా అంచనాలు పెట్టుకున్నారు. కానీ అనుకోకుండా సినిమా ప్లాప్ కావడంతో సుమారు రూ.100కోట్లు లాస్ వచ్చిందట.. దీంతో రాజుగారు తన కూతురి భవిష్యత్ కోసం ఆ వంద కోట్ల నష్టాన్నిఆయనే భరించారట.. దీనికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతుండగా.. ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియాల్సి ఉంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది