Krithi Shetty : టాలీవుడ్లో యంగ్ హీరోయిన్ అక్కినేని హీరోతో నటిస్తే ఆ తర్వాత అదే ఫ్యామిలీ హీరో సరసన రొమాన్స్ చేసే అవకాశం అందుకుంటుంది. దీనికి ఉదాహరణ ఇదరు గ్లామర్ బ్యూటీస్. వారే పూజా హెగ్డే, నిధి అగర్వాల్. మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా వెలుగుతున్న పూజా హెగ్డే ముందు అక్కినేని నాగ చైతన్య సరసన ఒక లైలా కోసం సినిమాలో హీరోయిన్గా నటించింది. అదే సమయంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పరిచయమైన ముకుంద మూవీలోనూ నటించింది. ఈ రెండు సినిమాలు అంతగా అకట్టుకోలేదు. ఆ తర్వాత బాలీవుడ్కు వెళ్ళిన పూజా అక్కడ హిట్ అందుకోలేదు.
దాంతో మళ్ళీ తిరిగి టాలీవుడ్కు వచ్చింది. ఇక్కడ మూడు నాలుగు ఫ్లాపుల తర్వాత మహేష్ బబుతో చేసిన మహర్షి సినిమాతో హిట్ అందుకుంది. ఆ తర్వాత అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాలు చేసి క్రేజీ హీరోయిన్గా మారింది. అప్పటి నుంచి మేకర్స్ పూజాను లక్కీ హీరోయిన్గా చూస్తున్నారు. అందుకే, అఖిల్ నటించిన మూడు సినిమాల ఫ్లాప్ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమాలో హీరోయిన్గా పూజాను తీసుకున్నారు. చైతూతో చేసిన ఒక లైలా కోసం ఓ మాదిరిగా హిట్ అయినా..అఖిల్ సరసన నటించిన సినిమా మాత్రం సూపర్ హిట్ అయింది.ఇక నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించిన మొదటి తెలుగు సినిమా నాగ చైతన్యతోనే. సవ్యసాచి సినిమాలో చైతన్యకు జోడీగా నటించింది.
ఆ వెంటనే అఖిల్ సరసన మిస్టర్ మజ్ఞూ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ రెండు సినిమాలు నిధికి హిట్ ఇవ్వలేకపోయాయి. కానీ, అన్నదమ్ములతో మాత్రం బాగానే రొమాన్స్ చేసింది నిధి. ఇప్పుడు ఈ క్రమంలోనే ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి కూడా అక్కినేని హీరోలతో సెటిలవుతుందని చెప్పుకుంటున్నారు. దీనికి కారణం ఇప్పటికే కృతి శెట్టి, చైతూతో కలిసి బంగార్రాజు సినిమాలో నటించి హిట్ అందుకుంది. తాజాగా మళ్ళీ చైతూ సరసన కొత్త సినిమాలో హీరోయిన్గా ఎంపికైంది. రెండవసారి చైతూతో రొమాన్స్కు రెడీ అయిన కృతి శెట్టి నెక్స్ట్ సినిమాలో అఖిల్ సరసన నటించే అవకాశం అందుకోవడం గ్యారెంటీ అని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అరడజను సినిమాలున్నాయి.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.