
Rajamouli likes Mahesh Babu so much
Mahesh Babu – Rajamouli : దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో సినిమా అంటే ఉండే అంచనాలు ఊహించడం చాలా కష్టం. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాకుండా విదేశీ బాక్సాఫీస్ వద్ద కూడా సత్తా చాటారు జక్కన్న. డివైడ్ టాక్తోనే దాదాపు 1100 కోట్ల వరకు వసూళ్ళు రాబట్టి అందరికీ షాకిచ్చింది. ఇలాంటి అగ్ర దర్శకుడు మొదటిసారి సూపర్ స్టార్ మహేశ్ బాబుతో పాన్ ఇండియా స్థాయిలో సినిమాను చేస్తున్నారంటే ముందు మహేశ్ను పక్కాగా ఒప్పించాల్సింది కథ తోనే.
ఇక ఈ కాంబోలో సినిమా అనే మాట ఇప్పటిది కాదు. ఓ పదేళ్ళ క్రితం అనుకున్న ప్రాజెక్ట్. కానీ, ఇప్పటికీ కదలికలు మొదలయ్యాయి. అఫీషియల్గా ఇంకా ప్రాజెక్ట్ను ప్రకటించలేదు. చేసేది మాత్రం పక్కా. ఇటీవల మహేశ్ బాబు కూడా సర్కారు వారి పాట సినిమాతో వచ్చి చాలా ఏళ్ళ తర్వాత ఫ్లాప్ చూడారు. ప్రస్తుతం మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. జూలై లేదా ఆగస్టు నుంచి ఈ మూవీ సెట్స్ మీదకు రాబోతోంది. ఈ ఏడాది డిసెంబర్ వరకు షూటింగ్ కంప్లీట్ చేయాలని మహేశ్, త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి కారణం వెంటనే రాజమౌళి సినిమాను సెట్స్ మీదకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.
Mahesh Babu Clarity is hard to come by Rajamouli
అయితే, ఇప్పటివరకు పూర్తి స్థాయిలో కథే సిద్ధం కాలేదని సమాచారం. ఇటీవలే బేసిక్ లైన్ ఒకటి మహేశ్ బాబుకు చెప్పారట రాజమౌళి. అది కూడా ఫైనల్ కాలేదనే టాక్ వినిపిస్తుంది. అంతేకాదు, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ను ఈ సినిమాలో మహేశ్ సరసన నటింపచేయడానికి జక్కన్న ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు, మరికొందరు బాలీవుడ్ స్టార్ కూడా నటించనున్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే, ఇవన్నీ కేవలం రూమర్సేనట. అసలు కథ కూడా ఓ కొలిక్కి రాలేదని తెలుస్తోంది. మహేశ్ – రాజమౌళి ప్రాజెక్ట్ మొదలవ్వాలంటే ఇంకా చాలా సమయం పడుతుందని ఇండస్ట్రీ వర్గాలలో టాక్. బహుషా 2023 సమ్మర్ తర్వాతే ఈ ప్రాజెక్ట్ మూవ్ అవుతుందట.
Maha Shivratri : ఫిబ్రవరి 15, 2026న రానున్న మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా, శివాలయ సందర్శనలో భక్తులు పాటించాల్సిన…
Today Horoscope 15th February 2026 : వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ రోజు (ఆదివారం, 15 ఫిబ్రవరి 2026)…
T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ICC T20 World Cup 2026లో సౌతాఫ్రికా తన…
Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…
Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…
Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…
Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…
Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…
This website uses cookies.