
Mahesh Babu : గుంటూరు కారం నా చివరి సినిమా.. రాజమౌళి సినిమా తర్వాత తెలుగు సినిమాలు చేయనని చెప్పిన మహేష్ బాబు..!
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘ గుంటూరు కారం ‘ సినిమా సంక్రాంతి కానుక జనవరి 12న విడుదలై మిక్స్డ్ టాక్ ను సంపాదించుకుంది. అయితే వసూళ్ల పరంగా మాత్రం మంచి కలెక్షన్స్ సాధిస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్తోంది. అయితే రీసెంట్గా మహేష్ బాబు సుమ తో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్స్ అభిమానులకు కూడా షాకింగ్ గా అనిపించాయి. గుంటూరు కారం సినిమా నా చివరి చిత్రమని, ఈ సినిమా తర్వాత ఇక సినిమాలు తీయడం ఆపేస్తున్నానని మహేష్ బాబు చెప్పారు. మొత్తానికి సినిమాలు తీయడం మానేస్తానని కాదు తెలుగులో సినిమాలు చేయనని, రాజమౌళి సినిమా తర్వాత పాన్ ఇండియా సినిమాలు చేస్తానని తెలుగు సినిమాలు తక్కువగా చేస్తానని చెప్పారు.
ఇక గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు డాన్స్ కి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక ఇంటర్వ్యూలో సుమా కూడా డాన్స్ గురించి విడిగా చెప్పాల్సిన అవసరం లేదని, మహేష్ బాబు డాన్స్ ఇరగదీసారు అని ప్రశంసించారు. దానికి మహేష్ బాబు మాట్లాడుతూ ముందు నుంచి నేను త్రివిక్రమ్ ఒకటి అనుకున్నాం. రెండు పాటలకు డాన్స్ మాత్రం ఒక రేంజ్ లో చేయాలి అని ముందు నుంచి ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే దీని తర్వాత ఇప్పుడు రెగ్యులర్గా తెలుగు సినిమా పాటలు చేస్తామో తెలియదు, అది నేను చేసే చివరి తెలుగు సినిమా అవ్వచ్చు అంటూ మళ్ళీ జాగ్రత్తపడి డాన్సులు విషయంలో చేయగలిగిన చివరి తెలుగు సినిమా ఇదే అవ్వచ్చు అని మహేష్ బాబు కవర్ చేసారు.
ఇక మహేష్ బాబు తర్వాత సినిమా రాజమౌళి తో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఓ భారీ అడ్వెంచర్ సినిమాలో చేయబోతున్నారు. ఇక రాజమౌళి సినిమా అంటే మినిమం రెండు మూడు సంవత్సరాలు పడుతుంది. ఈ క్రమంలోనే మహేష్ బాబు గుంటూరు కారం తెలుగు సినిమా చివరిదని అనుంటారు. ఇక రాజమౌళితో సినిమా అంటే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వస్తుంది. జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ లాగా మహేష్ బాబు కూడా పాన్ ఇండియా హీరో అవుతారు. ప్రస్తుతం రాజమౌళి కూడా మహేష్ బాబు తో సినిమా తీసే ప్లాన్ లో ఉన్నారు. స్టోరీని సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లేలా రాజమౌళి ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా త్వరలోనే పవన్ ఇండియా హీరో అవడం ఖాయం అని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
SRH Fan Blackmagic : ఐపీఎల్ అంటేనే వినోదం, ఉత్కంఠ. కానీ ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ మరియు చెన్నై సూపర్…
Business : ప్రపంచంలో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నప్పటికీ కొంతమంది ఎంచుకునే మార్గాలు సాధారణ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ వినియోగించే WhatsApp ఇప్పుడు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటివరకు పూర్తిగా…
Gold : ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. స్మార్ట్ఫోన్ యాప్స్ అందుబాటులోకి రావడంతో బంగారాన్ని కొనుగోలు…
Mangoes : వేసవి కాలం అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. సహజంగా తీపి రుచితో ఆకట్టుకునే ఈ…
Tea : ఉదయం నిద్రలేవగానే వేడి వేడి టీ కప్పు లేకపోతే చాలా మందికి రోజు మొదలవదనే చెప్పాలి. టీ…
Millet Breakfast : ఉదయం లేవగానే కొందరికి అలసట, నీరసం అనిపించడం సాధారణ విషయం. రాత్రి నిద్ర బాగా పడినా…
BPCL : ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి శుభవార్త అందింది. ప్రముఖ పబ్లిక్…
Aadhaar Card : భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ…
PM Modi : ఎన్నికల రాజకీయాల్లో అనుభవం కలిగిన ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన ప్రత్యేక శైలిని ప్రదర్శించారు.…
Samantha : అక్కినేని వారసుడు నాగచైతన్య, అగ్రనటి సమంత రూత్ ప్రభు ప్రేమకథ టాలీవుడ్లో ఒకప్పుడు హాట్ టాపిక్గా నిలిచింది.…
Airtel : టెలికాం రంగంలో మరోసారి ధరల పెంపు చర్చకు దారి తీసింది. ప్రముఖ టెలికాం సంస్థ Airtel తన…
This website uses cookies.