Guntur Karam Movie : ఇక‌పై అమ్మా-నాన్న అంతా మీరే.. గుంటూరు కారం ప్రీరిలీజ్ లో మ‌హేష్ బాబు ఎమోష‌న‌ల్ మాట‌లు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Guntur Karam Movie : ఇక‌పై అమ్మా-నాన్న అంతా మీరే.. గుంటూరు కారం ప్రీరిలీజ్ లో మ‌హేష్ బాబు ఎమోష‌న‌ల్ మాట‌లు

Guntur Karam Movie : పాన్ ఇండియా స్టార్ అంటే ఫ్యాన్స్ లో ఏమాత్రం క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. మహేష్ బాబు సినిమా వచ్చిందంటే థియేటర్లో అభిమానులు కోలాహలం నెలకొంటుంది. త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న గుంటూరు కారం మూవీపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.అయితే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ నుంచి ఓ గ్లిమ్స్, మూడు పాటలు ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో గుంటూరు […]

 Authored By jyothi | The Telugu News | Updated on :10 January 2024,4:00 pm

Guntur Karam Movie : పాన్ ఇండియా స్టార్ అంటే ఫ్యాన్స్ లో ఏమాత్రం క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. మహేష్ బాబు సినిమా వచ్చిందంటే థియేటర్లో అభిమానులు కోలాహలం నెలకొంటుంది. త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న గుంటూరు కారం మూవీపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.అయితే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ నుంచి ఓ గ్లిమ్స్, మూడు పాటలు ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో గుంటూరు కారం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.  అయితే నిన్న సాయంత్రం గుంటూరులో జరిగిన గుంటూరు కారం మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు ఎమోషనల్ మాటలతో అభిమానులకు ఎంతో దగ్గర అయ్యాడు.

నాకు మీరే “అమ్మా నాన్న ఇక అన్ని మీరే ‘అని ఎమోషనల్ గా అభిమానులను చూస్తూ అనడంతో అభిమానులలో ఓ చిన్నపాటి అలజడి మొదలైంది. సూపర్ స్టార్ మహేష్ లు ఈ యాంగిల్ ఎప్పుడు చూడలేదు.. అభిమానులలో అమ్మానాన్నలు చూసుకుంటాను అని చెప్పడంతో ఈ గుంటూరు కారం ఈవెంట్లో హాజరైన అభిమానులు నే కాకుండా సోషల్ మీడియా ఫ్యాన్స్ అభిమానులు కూడా బాధ వ్యక్తం చేశారు.ఇటీవలలో నిర్మాత వంశీ అనవసరంగా ఫ్యాన్స్ పై గొడవ క్రియేట్ చేసిన సందర్భాన్ని కూడా మహేష్ బాబు మాటలతో అందరూ మరిచిపోతారు అంటూ సోషల్ మీడియాలో ఫాన్స్ వారి అభిమానాన్ని వ్యక్తం చేశారు.’గుంటూరు కారం’ మహేష్ అభిమానులకు చాలా మంచి మూవీ. ఎందుకనగా రాజమౌళి సినిమా రిలీజ్ అవ్వడానికి కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది.

ఆనాటి వరకు వాళ్లకి గుంటూరు కారమే అన్ని.. బాహుబలి కి ముందు ప్రభాస్ కి మిర్చి లాగా ఇప్పుడు మహేష్ బాబు కి గుంటూరు కారం కాబోతోంది.
ఒకే సంవత్సరంలో మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి తండ్రి కృష్ణ అన్నయ్య రమేష్ బాబు తనకు దూరమయ్యారు.. అందుకే తను ఎమోషనల్ గా అభిమానులతో మీరు నా గుండెల్లో ఉంటారు. మీరే నాకు అన్ని అంటూ.. ఎప్పుడు చేసేది మీకు చెయ్యెత్తి దండం పెట్టడం కంటే ఇంక నేనేమీ చేయలేను అంటూ చాలా ఎమోషనల్ గా స్పీచ్ ఇవ్వడం జరిగింది. అయితే ఇన్నాళ్లపాటు తనలో దాగివున్న ఎమోషనల్ నిన్న ఈవెంట్ లో ఒక్కసారిగా బయటపెట్టాడు. సూపర్ స్టార్ మహేష్ తన మాటల్లో నిజాయితీ కనిపించడమే కాదు. చివర్లో అభిమానులకి ఇలా చెయ్యెత్తి దండం పెట్టడం కూడా అభిమానులకి బాగా దగ్గరయ్యాడు మహేష్ బాబు.
ఇక జనవరి 12న విడుదలయ్యే గుంటూరు కారం ఏ విధంగా ఉండబోతుందో అభిమానులకి చెప్పక్కర్లేదు అన్నట్లుగా అభిమానులు ఫీల్ అవుతున్నారు..

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది