Guntur Kaaram : మహేశ్ బాబు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. గుంటూరు కారం ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. చాలా ఘాటుగా ఉంది భయ్యా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Guntur Kaaram : మహేశ్ బాబు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. గుంటూరు కారం ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. చాలా ఘాటుగా ఉంది భయ్యా

Guntur Kaaram : గుంటూరు కారం.. ప్రిన్స్ మహేశ్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్. ఈ మూవీ షూటింగ్ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు విడుదలయ్యాయి. మహేశ్, త్రివిక్రమ్ కాంబో కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అతడు సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వీళ్ల కాంబోలో 12 ఏళ్ల తర్వాత వస్తున్న మూవీ కావడంతో […]

 Authored By kranthi | The Telugu News | Updated on :7 November 2023,5:01 pm

ప్రధానాంశాలు:

  •  గుంటూరు కారం తొలి పాట చాలా ఘాటుగా ఉందంటున్న ప్రేక్షకులు

  •  మాస్ మసాలా అంటూ అదరగొట్టేసిన లిరిక్స్

  •  తమన్ మ్యూజిక్ అదుర్స్

Guntur Kaaram : గుంటూరు కారం.. ప్రిన్స్ మహేశ్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్. ఈ మూవీ షూటింగ్ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు విడుదలయ్యాయి. మహేశ్, త్రివిక్రమ్ కాంబో కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అతడు సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వీళ్ల కాంబోలో 12 ఏళ్ల తర్వాత వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో మహేశ్ బాబు పూర్తి స్థాయిలో మాస్ మసాలా అవతారంలో కనిపించనున్నారు. సినిమా పేరు కూడా గుంటూరు కారం అని పెట్టడంతో ఈ సినిమా చాలా ఘాటుగానే ఉండేటట్టు ఉంది అని ప్రేక్షకులు భావిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ధమ్ మసాలా బిరియాని పేరుతో లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. ఈ పాటను సంజిత్ పాడాడు. తమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ లో దుమ్ములేపుతోంది. అబ్బో పాట చాలా ఘాటుగా ఉంది అంటూ ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. జనవరి 12, 2024 లో ఈ మూవీ విడుదల కానుంది. ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. మరో హీరోయిన్ కూడా ఉంది. మీనాక్షీ చౌదరి కూడా మహేశ్ తో రొమాన్స్ చేయనుంది. ఈ సినిమాకు చిన్నబాబు, నాగవంశీ నిర్మాతలు. ఈ సినిమా కోసం మహేశ్ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది