Mahesh Babu : మ‌హేష్ న‌టించిన సినిమాని ఆయ‌న త‌ల్లి వంద సార్లు చూసిందా.. చూసిన ప్ర‌తిసారీ ఏడ్వ‌డ‌మేన‌ట‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mahesh Babu : మ‌హేష్ న‌టించిన సినిమాని ఆయ‌న త‌ల్లి వంద సార్లు చూసిందా.. చూసిన ప్ర‌తిసారీ ఏడ్వ‌డ‌మేన‌ట‌..!

Mahesh Babu : సూప‌ర్ స్టార్ కృష్ణ స‌తీమ‌ణి, మ‌హేష్ బాబు త‌ల్లి ఇందిరా దేవి ఇటీవ‌ల క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. ఆమె మృతితో కృష్ణ కుటుంబం అంతా కూడా ఎంతో కుమిలిపోయారు. మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రత, కూతురు సితార తీవ్రంగా ఎమోషనల్ అయ్యారు. ఈ యేడాది కృష్ణ ఫ్యామిలీలో ఇది రెండో మరణం. జనవరిలో పెద్ద కుమారుడు రమేష్ బాబు కన్నుమూసిన ఘటన మరవక ముందే తాజాగా కృష్ణ సతీమణి ఇందిరా దేవి […]

 Authored By sandeep | The Telugu News | Updated on :20 October 2022,1:30 pm

Mahesh Babu : సూప‌ర్ స్టార్ కృష్ణ స‌తీమ‌ణి, మ‌హేష్ బాబు త‌ల్లి ఇందిరా దేవి ఇటీవ‌ల క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. ఆమె మృతితో కృష్ణ కుటుంబం అంతా కూడా ఎంతో కుమిలిపోయారు. మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రత, కూతురు సితార తీవ్రంగా ఎమోషనల్ అయ్యారు. ఈ యేడాది కృష్ణ ఫ్యామిలీలో ఇది రెండో మరణం. జనవరిలో పెద్ద కుమారుడు రమేష్ బాబు కన్నుమూసిన ఘటన మరవక ముందే తాజాగా కృష్ణ సతీమణి ఇందిరా దేవి కన్నమూయడం విషాదకరం. రీసెంట్ గా ఆమె దశదిన కర్మను కూడా వారి నివాసంలోనే జరిపించారు. ఇక వారి సొంతూరిలో ఇందిరా దేవి సంస్మరణ సభను ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఏ సినిమా అంటే..

ఇందిరా దేవికి సంబంధించి తాజాగా ఓ ఆస‌క్తిక‌ర విష‌యం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. తేజ డైరెక్షన్ లో వచ్చిన ‘నిజం’ చిత్రం ఇందిరాదేవికి చాలా ఇష్ట‌మ‌ట‌. ఈ సినిమాలోని ఎమోషనల్ సీన్స్, తల్లి, కొడుకు మధ్య సాగే సన్నివేశాలు ఆడియెన్స్ చేత కంటతడి పెట్టించాయి. అయితే ఇందిరా దేవి ఇదే సినిమాను తను చనిపోయే వరకు వందసార్లు చూసిందంట. అంతేకాకుండా తను మరణించడానికి నెల రోజుల ముందుకు కూడా ‘నిజం’ సినిమా చూసిందంట. త‌ల్లి, కొడుకుల మ‌ధ్య ఉండే ఎమోష‌న‌ల్ సీన్స్ ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయ‌ని. ఇవి ఇందిరా దేవిని కూడా ఎంతో ఎమోష‌న‌ల్‌కి గురి చేశాయ‌ని స‌మాచారం.

mahesh babu movie watched by indira devi

mahesh babu movie watched by indira devi

ఈ సినిమాని వంద సార్లు కూడా చూసింద‌ని టాక్.ఇక ఇందిరా దేవి జీవితంలో ఎన్నో క‌ష్టాలున్నాయి. డిగ్రీ పూర్తైన వెంటనే కృష్ణ.. మద్రాసు వెళ్లి అక్కడ సినిమా అవకాశాల కోసం వేట మొదలుపెట్టారు. అలా 1965లో ‘తేనే మనసులు’ అనే సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన ఆయన.. అదే సంవత్సరం నవంబర్‌లో ఇందిరా దేవిని వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కొన్నేళ్లపాటు కృష్ణ- ఇందిరా దేవి దంపతుల వైవాహిక జీవితం సజావుగా సాగింది. ఈ జంటకు రమేష్ బాబు, పద్మావతి జన్మించారు. ఆ సమయంలోనే కృష్ణ, తోటి నటి విజయ నిర్మలతో సహజీవనం చేసినట్లు ప్రచారం జరిగింది. అదే నిజం చేస్తూ 1969లో విజయ నిర్మలను గుడిలో రెండో పెళ్లి చేసుకున్నారు కృష్ణ.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది