Mahesh Babu : కోలివుడ్ దర్శకుడు శంకర్ గురించి తెలియని వారుండరు. ఆయన సినిమాలు భారీ స్థాయిలో ఉండటమే అందుకు కారణం. దేశంలో పలు సినిమా పరిశ్రమల్లో ఎవరూ టెక్నాలజీని వినియోగించని సమయంలోనే సూపర్ స్ఠార్ రజినీ కాంత్తో రోబో సినిమా తీసి ఇండియన్ సినిమాను హాలీవుడ్ రేంజ్కు తీసుకెళ్లిన ఘనత శంకర్కే దక్కుతుంది. ఆయన ప్రతీ సినిమా గ్రాండ్గా ఉండాలని భావిస్తారట.. ఆయన తీసే సినిమాలకు ఎంత బడ్జెట్ అయినా పెట్టేందుకు నిర్మాతలు వెనకాడరంటే అర్థం చేసుకోవచ్చు శంకర్ స్టామినా..
శంకర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్చరణ్తో ఆర్సీ 15 సినిమాను తెరకెక్కిస్తున్నాడు.అంతేకాకుండా కమల్ హాసన్తో ఇండియన్ -2 సినిమాను కూడా తెరకెక్కిస్తున్నాడు.ప్రస్తుతం ఆ సినిమా 70 శాతం చిత్రీకరణ పూర్తవ్వగా నిర్మాతలతో విబేధాల కారణంగా ఆ సినిమా ప్రస్తుతం షూటింగ్ ఆగిపోయింది. దర్శకుడు శంకర్ తన తొలి సినిమా జెంటిల్మెన్ నుంచి ఇప్పటివరకు అన్ని సక్సెస్ ఫుల్ సినిమాలను తెరకెక్కించాడు. ఐ (మనోహరుడు) మూవీ మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.మేకింగ్ పరంగా సత్తా ఉన్నా స్టోరీ పరంగా దెబ్బతినడంతో ఆ సినిమా ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది.
అయితే, మహేశ్ బాబు దర్శకుడు శ్రీనువైట్లతో దూకుడు సినిమా చేస్తున్న సమయంలో స్నేహితుడు మూవీలో మెయిన్ రోల్ కోసం శంకర్ మహేశ్ను సంప్రదించాడట.. ఆ సినిమా బాలీవుడ్లో సూపర్ హిట్ మూవీ అయిన త్రి ఇడియట్స్. అమీర్ ఖాన్ చేసిన రోల్ కోసం మహేశ్ ను సంప్రదించగా.. తనకు సెట్ అవ్వదనే కారణంతో మహేశ్ బాబు ఆ ఆఫర్ ను తిరస్కరించినట్టు పేర్కొన్నాడు.ఇదే విషయాన్ని దర్శకుడు శ్రీనువైట్లకు కూడా చెప్పినట్టు మహేశ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.