Mahesh Babu: ముచ్చ‌ట‌గా మూడోసారి.. మ‌హేష్ అభిమానుల‌కి ఇక పూన‌కాలే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mahesh Babu: ముచ్చ‌ట‌గా మూడోసారి.. మ‌హేష్ అభిమానుల‌కి ఇక పూన‌కాలే..!

Mahesh Babu: అత‌డు, ఖ‌లేజా చిత్రాల త‌ర్వాత మ‌హేష్ బాబు- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో చిత్రం రూపొంద‌నున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఎప్పుడో అనౌన్స్‌మెంట్ రాగా, ఈ రోజు మూవీకి సంబంధించి పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. గత కొన్నేళ్లుగా వీళ్లిద్దరు కలిసి సినిమా చేస్తే చూడాలని చాలా కాలంగా అభిమానులు వేచి చూస్తున్నారు. కాసేపటి క్రితమే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘SSMB28’ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :3 February 2022,3:00 pm

Mahesh Babu: అత‌డు, ఖ‌లేజా చిత్రాల త‌ర్వాత మ‌హేష్ బాబు- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో చిత్రం రూపొంద‌నున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఎప్పుడో అనౌన్స్‌మెంట్ రాగా, ఈ రోజు మూవీకి సంబంధించి పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. గత కొన్నేళ్లుగా వీళ్లిద్దరు కలిసి సినిమా చేస్తే చూడాలని చాలా కాలంగా అభిమానులు వేచి చూస్తున్నారు. కాసేపటి క్రితమే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘SSMB28’ అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఈరోజు ఉదయం రామానాయుడు స్టూడియోలో పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. ఈ కార్యక్రమానికి ఎప్పటిలాగే మహేష్ బాబు హాజరు కాలేదు. కానీ ఆయన తరపున మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్, పూజ హెగ్డే, త్రివిక్రమ్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

దర్శకుడు త్రివిక్రమ్ పూజా కార్యక్రమాలు నిర్వహించి సినిమాను ప్రారంభించారు. షూటింగ్‌, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ‘SSMB28’ మహేష్ బాబు, త్రివిక్రమ్, థమన్, పూజా హెగ్డే మరియు హారిక హాసిని క్రియేషన్స్ కలయికలో రాబోతోంది. ఈ సినిమా మార్చిలో సెట్స్‌పైకి రానుంది. మహేష్ బాబు, త్రివిక్రమ్ 12 సంవత్సరాల తిరిగి చేయబోతున్న ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. త్రివిక్రమ్ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయగా, ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.

mahesh babu trivikram srinivas combo movie launched

mahesh babu trivikram srinivas combo movie launched

Mahesh Babu: జోరు పెంచిన మ‌హేష్‌..

ప్ర‌స్తుతం మ‌హేష్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘స‌ర్కారు వారి పాట‌’. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్స్‌పై సినిమా నిర్మిత‌మ‌వుతుంది. సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. సినిమాను మే 12న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లవుతుది. మేక‌ర్స్ దానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ విడుద‌ల చేశారు. మ‌రో వైపు త్రివిక్ర‌మ్ భీమ్లా నాయ‌క్ సినిమాకు సంబంధించిన వ‌ర్క్‌ను పూర్తి చేశారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది