Mega Family Heroes : టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోలు ఉన్నారు.. వారిలో మెగా ఫ్యామిలీకి చెందిన వారు చాలా మంది ఉన్నారు అనే విషయం తెల్సిందే. మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇంకా మరి కొందరు హీరోలు కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకు వెళ్తున్నారు. అయితే మెగా హీరోలు ఎవరు అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనేది మెగా ఫాన్స్ లో ఒక పెద్ద సందేహం. మెగా హీరోల్లో మాత్రమే కాకుండా ఏ సినిమా హీరో అయినా తాను చేస్తున్న కథ కు మరియు కేటాయిస్తున్న డేట్స్ కి ఇంకా తన యొక్క స్టార్డమ్ కి అనుగుణంగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటాడు.
ఉదాహరణకు గత సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతే కాకుండా రామ్ చరణ్ హీరోగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా విడుదలైంది. ఇక పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కూడా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ముగ్గురు హీరోల్లో గత ఏడాదికి గాను రామ్ చరణ్ అత్యధిక రెమ్యూనరేషన్ దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది, ఆర్ఆర్ఆర్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ఏకంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ నమోదు చేసింది. అందుకే రెమ్యూనరేషన్ తో పాటు లాభాల్లో వాటాగా రామ్ చరణ్ 100 కోట్లకు పైగా ఆ సినిమా ద్వారా పొందాడు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.
ఇక పవన్ కళ్యాణ్ గత ఏడాది దాదాపు 50 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ దక్కించుకున్నాడట. చిరంజీవి కూడా ఆచార్య సినిమా కు దాదాపుగా 50 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ సొంతం చేసుకున్నాడు అనేది టాక్. మొత్తానికి మెగా హీరోల్లో ఒక్కొక్క ఏడాది ఒక్కొక్కరిది పై చేయి అవుతుంది. మొన్న వాల్తేరు వీరయ్య సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది, కనుక చిరంజీవి ఈ సంవత్సరం తన రెమ్యూనరేషన్ ని భారీగా పెంచే అవకాశాలున్నాయి. సక్సెస్ మరియు ఫ్లాప్ ఇంకా సినిమాకు కేటాయించే డేట్స్ ని బట్టి ఏ హీరో అయినా రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. కనుక ఒక హీరో రెమ్యూనరేషన్ ఇంకో హీరో కంటే ఎక్కువ లేదా తక్కువ అని అనుకోవడానికి లేదు.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.