Manam Movie : మ‌నం రీరిలీజ్ షోలో సంద‌డి చేసిన నాగ చైత‌న్య‌.. స‌మంత‌తో పెళ్లి సీన్ రాగానే అంత చిరాకు ప‌డ్డాడు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Manam Movie : మ‌నం రీరిలీజ్ షోలో సంద‌డి చేసిన నాగ చైత‌న్య‌.. స‌మంత‌తో పెళ్లి సీన్ రాగానే అంత చిరాకు ప‌డ్డాడు..!

Manam Movie : అక్కినేని ఫ్యామిలీకి, ప్రేక్షకులకు మనం మూవీ ఎంత‌ స్పెషల్ ఫిల్మ్ అనేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.అక్కినేని నాగేశ్వర రావు, ఆయన తనయుడు కింగ్ నాగార్జున, మనవడు నాగ చైతన్య క‌లిసి న‌టించి తెగ సంద‌డి చేశారు. ఇక ఈ సినిమాలో అఖిల్, అమ‌ల కూడా చిన్న అతిథి పాత్ర‌ల‌లో క‌నిపించి సంద‌డి చేస్తారు. అయితే ఈ సినిమా విడుదలై మే23కి పదేళ్లు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దేవి థియేటర్లో […]

 Authored By ramu | The Telugu News | Updated on :24 May 2024,2:30 pm

Manam Movie : అక్కినేని ఫ్యామిలీకి, ప్రేక్షకులకు మనం మూవీ ఎంత‌ స్పెషల్ ఫిల్మ్ అనేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.అక్కినేని నాగేశ్వర రావు, ఆయన తనయుడు కింగ్ నాగార్జున, మనవడు నాగ చైతన్య క‌లిసి న‌టించి తెగ సంద‌డి చేశారు. ఇక ఈ సినిమాలో అఖిల్, అమ‌ల కూడా చిన్న అతిథి పాత్ర‌ల‌లో క‌నిపించి సంద‌డి చేస్తారు. అయితే ఈ సినిమా విడుదలై మే23కి పదేళ్లు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దేవి థియేటర్లో స్పెషల్ షో వేశారు. ఈ షోకి నాగ చైత‌న్య కూడా హాజ‌రు కాగా ప్రేక్ష‌కులు చైతూని చూసి తెగ గోల చేశారు.

చైతూని విసిగించేశారు..

దేవి థియేటర్ లో ఫ్యాన్స్ ఇప్పటికీ మనం చిత్రాన్ని సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా నాగ చైతన్య, సమంత మధ్య సన్నివేశాలు వచ్చినప్పుడు స్క్రీన్ దగ్గరకి వెళ్లి మరీ వెళ్లి నానా ర‌చ్చ చేశారు. సమంతతో నాగ చైతన్య పెళ్లి సన్నివేశం రాగానే ఫ్యాన్స్ సీట్లలోనుంచి లేచి గంతులేస్తూ చేస్తూ హంగామా చేశారు. నాగ చైతన్య ముందే ఫ్యాన్స్ గోల చేస్తుండ‌డం, పెళ్లి సీన్ స‌న్నివేశానికి తెగ అరుపులు అరుస్తుండ‌డంతో నాగ చైత‌న్య కాస్త చిరాకుగా వారిని కూర్చోమ‌ని చెబుతుంటాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతుంది.

Samantha

నాగ చైతన్య, సమంత నటించిన హిట్ చిత్రాల్లో మనం మూవీ ప్రత్యేకం అని చెప్పాలి. ఈ మూవీలో నటించే సమయంలో చై, సామ్ ప్రేమలో ఉన్నారు. 2017లో వివాహం చేసుకున్న చై, సామ్ ఫ్యాన్స్ కి షాకిస్తూ 2021లో విడిపోయిన సంగతి తెలిసిందే. విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన మ‌నం చిత్రంలో నాగార్జునకి జోడిగా శ్రీయ, నాగ చైతన్యకి జంటగా సమంత నటించారు. వీళ్ల మధ్య కెమిస్ట్రీ సినిమాకే హైలైట్. ఈ చిత్రంలో నాగార్జునకి తండ్రిగా నాగ చైతన్య నటించారు. ఏఎన్నార్ కి తండ్రిగా నాగార్జున నటించారు. మ‌నం సినిమాకి సీక్వెల్ తీయాల‌ని ఎప్ప‌టి నుండో అభిమానులు కోరుతున్నారు. మ‌రి ఆ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది