Home » Entertainment » Niharika And Chaitanya Are Going To Meet Again
Entertainment

Niharika : మళ్లీ కలుసుకోబోతున్న నిహారిక- చైతన్య .. ఒక ల్యాండ్ వీరిద్దరిని నిజంగా కలపనుందా..!

Authored By
Anusha V
The Telugu News | Updated on: December 14, 2023, 6:13 pm
Advertisement

Niharika : గత కొంతకాలం నుండి ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతున్న వార్త నీహారిక కొణిదెల తన భర్త చైతన్యతో విడాకులు తీసుకోవడం. మెగా బ్రదర్ నాగబాబు నిహారిక పెళ్లిని ఎంతో ఘనంగా చేశారు. అయితే పెళ్లి అయిన రెండు సంవత్సరాలకే నిహారిక తన భర్తతో విడాకులు తీసుకున్నారు. ఇక అప్పటినుంచి ఆమె గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయినా కానీ నిహారిక ఇటు నాగబాబు నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. నిహారిక విడాకులు తీసుకొని చాలా రోజులు అవుతున్నప్పటికీ ఇంకా ఆమె గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త ట్రెండ్ అవుతూ వస్తోంది. ఆమె మరో పెళ్లి చేసుకోబోతున్నట్లు, మళ్లీ చైతన్య నిహారిక కలుసుకోబోతున్నట్లు ఇలా ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజాగా నిహారిక , చైతన్య కలుసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. చైతన్య నిహారిక ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఒక ల్యాండ్ ను కొన్నారట. ఇప్పుడు ఆ ల్యాండ్ అమ్మడానికి ఇద్దరు సంతకాలు కావాలి. ఇద్దరు కలిసి ఉన్నట్లుగా ప్రూఫ్ చూపించాలి. దీని కోసం మళ్లీ నిహారిక చైతన్య కలవబోతున్నారని సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది. ముందుగా నిహారిక సంతకం పెట్టాక, చైతన్య సంతకం పెడతారు. వీరిద్దరూ సంతకం పెట్టాకే ఆ ల్యాండ్ అమ్మబోతున్నారట. అ ల్యాండ్ మీద వచ్చిన డబ్బులు ఇరువురు సమానంగా పంచుకోనున్నారు. దాని వలనే చైతన్య నిహారిక మళ్లీ కలవబోతున్నారని వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోపక్క జొన్నలగడ్డ చైతన్యకి రెండో పెళ్లి చేయడానికి సంబంధాలు చూస్తున్నారట. రెండో పెళ్లి చేసుకోవడానికి ఆయన సిద్ధం అయిపోయారు.

ఇటువైపు నిహారిక ప్రొడ్యూసర్ గా బిజీగా ఉన్నారు. సినిమాలు నిర్మిస్తూ, సినిమాలలో నటిస్తూ వెబ్ సిరీస్ లు చేస్తూ నిహారిక కెరియర్ లో చాలా బిజీగా ఉన్నారు. ఇక చైతన్య తల్లిదండ్రులు రెండో పెళ్లి చేయటానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఇకపోతే ల్యాండ్ మళ్లీ వీరు ఇద్దరిని కలపబోతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా వారిద్దరూ కలుస్తుంది ల్యాండ్ కోసమే తప్ప వ్యక్తిగతంగా కాదు. భవిష్యత్తులో వీరిద్దరూ కలిసే అవకాశం లేదని తెలుస్తుంది. ల్యాండ్ మీద వచ్చిన డబ్బులు కూడా ఇద్దరు సమానంగా పంచుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక నాగబాబు , వరుణ్ తేజ్ నిహారిక కు చాలా సపోర్ట్ గా ఉంటున్నారు. లైఫ్ లో ఎదగాలని, చిన్న చిన్న డిస్టర్బెన్స్లు వస్తూనే ఉంటాయని, పట్టించుకోకుండా ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ గా ఉండాలని, కెరియర్ లో దూసుకుపోవాలని చాలా పాజిటివ్ దృక్పథంతో మెగా ఫ్యామిలీ ఉన్నారు.

Anusha V

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి