Nithya Menen : నిత్యా మీనన్ .. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్స్లో ఒకరు. చివరిగా భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. ఇప్పటికీ గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండే ఆమె కెరియర్లో పెద్దగా క్లిక్ అవ్వలేదని చెప్పాలి. ఈ మధ్యనే తెలుగులో మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్న ఆమె తన జీవితానికి సంబంధించిన ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. కేరళకు చెందిన సంతోష్ వర్కీ అనే వ్యక్తి తనను ఇబ్బందులు పెట్టినట్లు వెల్లడించారు. మోహన్ లాల్ హీరోగా నటించిన ఆరాట్టు అనే సినిమాను డీకోడ్ చేసిన సంతోష్ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ప్రకటించి వార్తల్లోకి ఎక్కాడని, అప్పటినుంచి అతను తన గురించి అనేక విషయాలు ఉన్నవి లేనివి కల్పించి చెబుతూ తనను ఇబ్బంది పెడుతున్నాడని, ఒకరకంగా మానసికంగా వేధిస్తున్నాడని నిత్యామీనన్ వెల్లడించారు.
‘నా పెళ్లి గురించి బయటకు వచ్చిన వార్తల్లో అస్సలు నిజం లేదు. సినిమా షూటింగ్స్తో ఫుల్ బిజీగా ఉంటూ వస్తున్నాను. అదే సమయంలో కాలు బెణికింది. దాంతో కాస్త రెస్ట్ దొరికినట్టయ్యింది. ఆ సమయంలో కథలు చెబుతామని కొందరు అన్నారు. అయితే రెస్ట్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు వినట్లేదు అని చెప్పాను. ఎందుకు నిత్యా మీనన్ కథలు వినటం లేదు అనే ప్రశ్న అక్కడే మొదలైంది. నిత్యా మీనన్ కథలు వినటం లేదంటే పెళ్లి చేసుకుంటుందేమో అనే వార్తలు పుట్టేశాయి’’ అన్నారు. నేను ఇండస్ట్రీలో ఎప్పుడూ ఎదుర్కొనే ఇబ్బంది ఏంటంటే..నన్ను సినిమా ఇండస్ట్రీ బ్యాన్ చేసిందనే వార్తలు పుట్టించారు. చాలా రూమర్స్ క్రియేట్ చేశారు. రీసెంట్గా నిత్యామీనన్ తిరు అనే సినిమాతో పలకరించింది.
నాతో పనిచేయని వారే అలా చెబుతుంటారు. రూమర్స్ క్రియేట్ చేసేవాళ్లు చాలా తక్కువగా ఆలోచిస్తున్నారని నేను అనుకుంటాను. మనం వాళ్లలాగా కిందకెళ్లి మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. అది వాళ్ల జీవితం. పక్కవాళ్ల గురించి కావాలనే మాట్లాడటం మనకే మంచిది కాదు. నేను నా పనిలో సంతోషాన్ని వెతుక్కుంటాను. అందరి గురించి నేను ఆలోచిస్తూ పోతే నా పనులు చేసుకోవడానికి సమయం దొరకదు అని నిత్యా మీనన్ పలు విషయాలు చెప్పుకొచ్చారు.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.