paruchuri venkateswara rao new look viral
Paruchuri Venkateswara Rao :తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పరుచూరి బ్రదర్స్ అంటే తెలియని వారు ఉండరు. ఇద్దరు రచయితలుగానే కాక నటులుగాను మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు. ఎన్నో సినిమాలకు అద్భుతమైన డైలాగ్స్ అందించి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 300 సినిమాలకు పైగా రచన చేసిన ఈ ఇద్దరూ.. గుర్తుండిపోయే మాటలు పని చేసారు. ఎన్నో సినిమాలకు కథ, స్క్రీన్ ప్లేతో పాటు దర్శకత్వం కూడా వహించారు. నాటి ఎన్టీఆర్ నుంచి నేటి ఎన్టీఆర్ వరకు మూడు తరాల హీరోలతో పని చేసిన అనుభవం వీళ్ల సొంతం. మొన్నటికి మొన్న చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నెం 150 వరకు ఎన్నో సినిమాలకు రాసారు వాళ్లు. అయితే ఈ మధ్య కాలంలో వయోభారంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
పరుచూరి బ్రదర్స్ లో పెద్దవారైన పరుచూరి వెంకటేశ్వరరావు (80) ప్రస్తుతం వృద్ధాప్యంతో బాధపడుతున్నారు. కనీసం బయటకు కూడా రావడం లేదు. అయితే ఇటీవలే ఆయనని కలిసిన దర్శకుడు జయంత్ సి పరాన్జీ పరుచూరి వెంకటేశ్వరరావుతో దిగిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ పిక్ చూసి అందరు షాక్ అవుతున్నారు.. వెంకటేశ్వరరావు గారు ఇలా అయ్యరెంటి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..1981లో పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ లకు ‘పరుచూరి బ్రదర్స్’ అని నామకరణం చేసి, తన సొంత చిత్రం ‘అనురాగదేవత’ ద్వారా రచయితులగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు ఎన్టీఆర్.
paruchuri venkateswara rao new look viral
పరుచూరి గోపాలకృష్ణ మాత్రం యూ ట్యూబ్ ఛానెల్ నడుపుతూ సినిమా రివ్యూస్ చెప్తున్నాడు. మరోవైపు వెంకటేశ్వర రావు మాత్రం దూరంగానే ఉన్నాడు. ఈ మధ్య బయటికి కూడా రావడం లేదు ఈయన. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా కొందరు పరుచూరిని కొన్ని రోజులుగా చూడటం లేదు. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత ఆయన దర్శనమే లేకుండా పోయింది. పైగా కొన్నేళ్ల కింద ఆయన భార్య చనిపోయారు. అప్పట్నుంచి మరింత కుంగిపోయారు పరుచూరి వెంకటేశ్వరరావు. దానికితోడు వయోభారంతోనూ బాధ పడుతున్నారు. ఇవన్నీ ఈయన మొహంలోనే కనిపిస్తున్నాయి.
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్గా మారారు.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
Nepal Crisis Deepens : నేపాల్లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
This website uses cookies.