Paruchuri Venkateswara Rao :తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పరుచూరి బ్రదర్స్ అంటే తెలియని వారు ఉండరు. ఇద్దరు రచయితలుగానే కాక నటులుగాను మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు. ఎన్నో సినిమాలకు అద్భుతమైన డైలాగ్స్ అందించి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 300 సినిమాలకు పైగా రచన చేసిన ఈ ఇద్దరూ.. గుర్తుండిపోయే మాటలు పని చేసారు. ఎన్నో సినిమాలకు కథ, స్క్రీన్ ప్లేతో పాటు దర్శకత్వం కూడా వహించారు. నాటి ఎన్టీఆర్ నుంచి నేటి ఎన్టీఆర్ వరకు మూడు తరాల హీరోలతో పని చేసిన అనుభవం వీళ్ల సొంతం. మొన్నటికి మొన్న చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నెం 150 వరకు ఎన్నో సినిమాలకు రాసారు వాళ్లు. అయితే ఈ మధ్య కాలంలో వయోభారంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
పరుచూరి బ్రదర్స్ లో పెద్దవారైన పరుచూరి వెంకటేశ్వరరావు (80) ప్రస్తుతం వృద్ధాప్యంతో బాధపడుతున్నారు. కనీసం బయటకు కూడా రావడం లేదు. అయితే ఇటీవలే ఆయనని కలిసిన దర్శకుడు జయంత్ సి పరాన్జీ పరుచూరి వెంకటేశ్వరరావుతో దిగిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ పిక్ చూసి అందరు షాక్ అవుతున్నారు.. వెంకటేశ్వరరావు గారు ఇలా అయ్యరెంటి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..1981లో పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ లకు ‘పరుచూరి బ్రదర్స్’ అని నామకరణం చేసి, తన సొంత చిత్రం ‘అనురాగదేవత’ ద్వారా రచయితులగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు ఎన్టీఆర్.
పరుచూరి గోపాలకృష్ణ మాత్రం యూ ట్యూబ్ ఛానెల్ నడుపుతూ సినిమా రివ్యూస్ చెప్తున్నాడు. మరోవైపు వెంకటేశ్వర రావు మాత్రం దూరంగానే ఉన్నాడు. ఈ మధ్య బయటికి కూడా రావడం లేదు ఈయన. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా కొందరు పరుచూరిని కొన్ని రోజులుగా చూడటం లేదు. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత ఆయన దర్శనమే లేకుండా పోయింది. పైగా కొన్నేళ్ల కింద ఆయన భార్య చనిపోయారు. అప్పట్నుంచి మరింత కుంగిపోయారు పరుచూరి వెంకటేశ్వరరావు. దానికితోడు వయోభారంతోనూ బాధ పడుతున్నారు. ఇవన్నీ ఈయన మొహంలోనే కనిపిస్తున్నాయి.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.