Niharika Konidela : రోజు రోజుకి మెగా అల్లు వివాదం రచ్చగా మారుతున్న విషయం తెలిసిందే. ఇరు ఫ్యామిలీల మధ్య దూరం పెరుగుతున్నట్టే కనిపిస్తోంది. అయితే నిహారిక చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. నిహారిక నిర్మాతగా ‘కమిటీ కుర్రోళ్లు’ అనే సినిమా చేసింది. ఆగస్టు 9న రిలీజ్ అయిన ఈ చిత్రం హిట్ టాక్తో థియేటర్లలో దూసుకుపోతుంది. ఈ చిత్రంలో దాదాపు అందరూ కొత్త ఆర్టిస్టులే. వీరిందరితో ఓ మంచి సినిమాను నిర్మించింది మెగా డాటర్. ఇప్పటికే కమిటీ కుర్రోళ్లు చిత్రాన్ని చిరంజీవి సహా పలువురు టాలీవుడ్ సెలబ్రెటీల అభినందించారు. అయితే తాజాగా జరిగిన సక్సెస్ సెలబ్రేషన్లో నిహారికకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆమెకి నెగెటివ్గా కామెంట్లు పెడుతున్నారు.
‘కమిటీ కుర్రోళ్లు’కి సంబంధించిన ఓ ఈవెంట్లో నిహారిక మాట్లాడుతుండగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, బాబులకే బాబు కళ్యాణ్ బాబు, సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. దీంతో నిహారిక కాసేపు సైలెంట్గా ఉండి తర్వాత ఊహించని పంచ్ వేసింది. “అవునమ్మా మీ ఫ్యాన్స్ చెప్పింది కరెక్టే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు.. మా బాబాయ్ డిప్యూటీ సీఎం” అంటూ కౌంటర్ ఇచ్చింది. ఈ దెబ్బతో అప్పటివరకూ అరిచిన ఫ్యాన్స్ సైలెంట్ అయిపోయారు. దీంతో నిహారిక కామెంట్స్ కూడా చర్చనీయాంశంగా మారాయి.
ఇక ఇదిలా ఉంటే ఇటీవల అల్లు అర్జున్ కూడా మెగా ఫ్యామిలీతో వైరానికి దిగారు. .. ‘మై డియర్ ఫ్యాన్స్.. మీరే నా ఆర్మీ, నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. హీరోని చూసి చాలామంది ఫ్యాన్స్ అవుతారు, కానీ నేను నా ఫ్యాన్స్ని చూసి హీరోనయ్యా. నా నుంచి కొత్త సినిమా వచ్చి మూడేళ్లయినా మీరు చూపే ప్రేమ అస్సలు తగ్గలే. నన్ను ప్రేమించే వాళ్ల కోసం నిలబడగలగాలి. మన అనుకున్న వాళ్ల కోసం ఎంత వరకైనా వెళ్తా..! అంటూ కామెంట్ చేశారు. దీంతో మరోసారి మెగా వర్సెస్ అల్లు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది . సోషల్ మీడియా వేదికగా ఇరు వర్గాల అభిమానులు యుద్దానికి దిగుతున్నారు.
Job Mela : యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో…
Jaggery : బెల్లం అనేది రుచికి మాత్రమే కాదు చర్మ సమస్యలను కూడా దూరం చేస్తుంది అని మీకు తెలుసా.…
Namo Bharath Rapid Rail : దేశ వ్యాప్తంగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల గురించి విసృత ప్రచారం…
Johnny Master : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధిపు కేసు విషయంలో రోజు రోజుకి నిర్గాంతపోయే నిజాలు…
Janhvi kapoor : ఎన్టీఆర్ దేవర సినిమా మరో 10 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను కొరటాల…
Chandra Dosham : హిందూ మతంలో ఏడు రోజులు ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబడింది. అయితే సోమవారం…
Chandrababu : రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అండ్ ఎక్స్పో 2024 నాలుగో విడత సమావేశానికి గాంధీనగర్ ఆతిథ్యాం ఇస్తుండగా,…
Hyper Aadi : జానీ మాస్టర్ మీద ఢీ కంటెస్టెంట్, లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయడం మనకు తెలిసిందే.. కేవలం…
This website uses cookies.