Pawan Kalyan : జనసేనాని పవన్ కల్యాణ్ మళ్లీ తన రాజకీయ క్షేత్రంలోకి అడుగు పెట్టారు. ఆదివారం విశాఖ ఉక్కు కార్మికులకు మద్దతుగా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఒక రోజు దీక్ష చేశారు. ఈ సందర్భంగా దీక్ష అనంతరం పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ దీక్షలో పాల్గొనేందుకు వస్తున్నారని తెలుసుకుని జనసైనికులు, పవన్ కల్యాణ్ అభిమానులు మంగళగిరికి తరలివచ్చారు.ఏపీ ఆరోగ్యానికి వైసీపీ హానికరమని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా విమర్శించారు. జనసేన అధికారంలోకి వస్తే వైసీపీ చేత తప్పులకు సమాధానం చెప్పిస్తామని అన్నారు పవన్.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఎంపీలు పోరాడటం లేదని ఈ సందర్భంగా పవన్ ఆరోపించారు. ఈ క్రమంలోనే జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఏపీ సర్కారుపై సంచలన కామెంట్స్ చేశారు. తన సినిమాల ప్రదర్శన నిలిపేసి తన ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు. తన సినిమాలను ఆపేసి దెబ్బ కొట్టాలని చూశారని, ఒక వేళ అటువంటి పరిస్థితులే ఏర్పడితే తన సినిమాలు ఉచితంగా ఆడిస్తానని పవన్ కల్యాణ్ అన్నారు. తమ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటే ప్రజల తరఫున నిలబడతామని, 2024లో వచ్చేది తమ ప్రభుత్వమేనని జనసేనాని ధీమా వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ మాటలతో జనసేన నేతలు, కార్యకర్తల్లో జోష్ వచ్చింది. జనసేనాని చాలా కాలం తర్వాత మళ్లీ రాజకీయ క్షేత్రంలోకి దిగి ప్రజల తరఫున మట్లాడుతున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
ఈ ఒక్కరోజు దీక్ష ద్వారా పవన్ మళ్లీ ఏపీ పాలిటిక్స్లో సెంటర్ పాయింట్ అయ్యారని విశ్లేషిస్తున్నారు. ఇక పవన్ సినిమాల విషయానికొస్తే.. ఆయన నటించిన ‘భీమ్లా నాయక్’ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇందులో పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ ప్లే చేశారు. ఈ పిక్చర్.. మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.